'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి' - అమరావతి ఇస్యూ
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు కాగడాల ర్యాలీ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని నేతలు అన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.బస్టాండ్ సెంటర్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు కాగడలను పట్టుకుని నడుచుకుంటూ ర్యాలీ చేశారు.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు వేల ఎకరాలు భూములను స్వచ్చందంగా ఇచ్చారన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైసీపీ...అధికారంలోకి రాగానే రాజధానిని మారుస్తాం అనడం మంచిది కాదని మండిపడ్డారు.రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలంటే అనువైన చోట పరిశ్రమలు తీసుకురావాలిగాని..ఇలా రాజధాని మార్పు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకునేంత వరకు తమ ఉద్యమాలను కొనసాగిస్తామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు.