ETV Bharat / state

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌

రాజధానిగా అమరావతి కొనసాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిపై మంత్రి బొత్స ప్రకటనలే గందరగోళానికి తెరలేపాయని విమర్శించారు.

author img

By

Published : Aug 30, 2019, 6:26 PM IST

పవన్

ముఖ్యమంత్రి మారితే రాజధాని మ ారుస్తారా అంటూ ప్రభుత్వాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్.. తుళ్లూరు బహిరంగసభలో రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతిపై మంత్రి బొత్స ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని విమర్శించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రాజధానికి అవసరమైన డబ్బును జగన్ తన జేబులో నుంచి ఇవ్వరన్న జనసేనాని... హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. రాజధానిపై చంద్రబాబు వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. తెదేపా హయాంలో రాజధానికి వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని అన్నారు. "రాజధానిగా అమరావతి ఉంటుందని నేను మాటిస్తున్నా" అంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

పవన్ పర్యటనకు వర్షం అడ్డంకి
తుళ్లూరు బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం... పవన్‌ కల్యాణ్ దొండపాడు, అనంతవరం, రాయపూడిలో పర్యటనకు బయలుదేరారు. ఈ సమయంలో వర్షం పడటంతో వాహనంలో నుంచే తన పర్యటనను కొనసాగించారు. కరకట్టపై వెళ్లే సమయంలో కూల్చివేసిన ప్రజావేదికను జనసేన నేతలు ఆగి చూశారు. పర్యటన పూర్తి చేసుకుని మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు.

ముఖ్యమంత్రి మారితే రాజధాని మ ారుస్తారా అంటూ ప్రభుత్వాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్.. తుళ్లూరు బహిరంగసభలో రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతిపై మంత్రి బొత్స ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని విమర్శించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రాజధానికి అవసరమైన డబ్బును జగన్ తన జేబులో నుంచి ఇవ్వరన్న జనసేనాని... హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. రాజధానిపై చంద్రబాబు వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. తెదేపా హయాంలో రాజధానికి వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని అన్నారు. "రాజధానిగా అమరావతి ఉంటుందని నేను మాటిస్తున్నా" అంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

పవన్ పర్యటనకు వర్షం అడ్డంకి
తుళ్లూరు బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం... పవన్‌ కల్యాణ్ దొండపాడు, అనంతవరం, రాయపూడిలో పర్యటనకు బయలుదేరారు. ఈ సమయంలో వర్షం పడటంతో వాహనంలో నుంచే తన పర్యటనను కొనసాగించారు. కరకట్టపై వెళ్లే సమయంలో కూల్చివేసిన ప్రజావేదికను జనసేన నేతలు ఆగి చూశారు. పర్యటన పూర్తి చేసుకుని మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు.

Intro:విజయనగరం జిల్లా
చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ విజయనగరం
మరియు చీపురుపల్లి ఎం పి బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లో ఫ్రీ dental checkup క్యాంపు నిర్వహించడం జరిగింది

నియోజకవర్గ వైసిపి కార్యకర్తలు కార్యక్రమంలో
ముగ్గురు డెంటల్ ప్రొఫెసర్లు
మరో ఏడు మంది డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు


Body:చీపురుపల్లి పంచాయతీ ఆఫీస్ లో జరిగిన మెడికల్ క్యాంప్ లో సుమారు 160 మంది వరకు డెంటల చెక్ కప్ చేయించుకున్నారు వీరిలో 58 మంది సుమారు నోట్ క్యాన్సర్తో బాధ పడుతున్నారని వారికి తగు మందులు జాగ్రత్తలు చెప్పారు గుట్కాలు కై నీలు వాడకూడదని చెప్పారు


Conclusion:అనంతరం బాపూజీ వృద్ధాశ్రమం లో ఉన్న వృద్ధులను కూడా పరీక్షించి తగు మందులు ఇచ్చారు
1 వాయిస్ బైట్
పేరు డాక్టర్ గోరంట్ల సతీష్ బాబు

2 వాయిస్
డాక్టర్ B. vamsi pavani

3 వాయిస్ బైట్
డాక్టర్ D .రామరాజు ,హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.