ETV Bharat / state

స్వామి.. నీ ఆస్తులకు దిక్కెవరు..?

author img

By

Published : Apr 1, 2023, 8:37 AM IST

HIGH COURT KEY COMMENTS ON TEMPLE LANDS: దేవుడి భూములు, ఆస్తులకు రెక్కలొస్తున్నాయి. కంచె చేను మేసిన చందంగా కాపాడేవారే దోచుకునేందుకు యత్నిస్తున్నారు. దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు.. ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు

HIGH COURT KEY COMMENTS ON TEMPLE LANDS
HIGH COURT KEY COMMENTS ON TEMPLE LANDS
స్వామి.. నీ ఆస్తులకు దిక్కెవరు..?

HIGH COURT KEY COMMENTS ON TEMPLE LANDS: దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప.. కాపాడేవారు కరవయ్యారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. దేవాదాయ శాఖలో అధికారుల పని తీరుకు అద్దం పడుతున్నాయి. దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. కోర్టులు పదే పదే మొట్టికాయలు వేసినా.. తమ ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు.

రాజకీయ ఒత్తిళ్లకు దేవదాయశాఖ తలొగ్గుతోంది..!: పాత గుంటూరులోని కంచి కామాక్షి ఏకాంబరేశ్వరస్వామి ఆలయ ఆస్తుల జాబితాలో నమోదైన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వు జారీ చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కమిషనర్‌గా ఉండేందుకు ఆయన అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో కమిషనర్‌ పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆలయాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు దేవదాయశాఖ తలొగ్గుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

30కోట్ల రూపాయలు వదులుకునేలా..: కాకినాడ పెద్ద మార్కెట్‌లోని నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన అర ఎకరం స్థలాన్ని 2002లో బహిరంగ వేలంలో ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన విద్యాసంస్థ 34.75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 15 రోజుల్లో ఆ సొమ్ము చెల్లించి, 45 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. సొమ్ము 9నెలల వ్యవధిలో 3 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. అయితే ఆ స్థలాన్ని ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. నిబంధనల ప్రకారం ఇచ్చిన గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోపోతే.. వేలం సొమ్ముతో పాటు స్థలం ఆలయానికే చెందుతుంది. అయితే 2015 నుంచి ఆ విద్యాసంస్థ అధిపతి స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నించినా కమిషనర్లు సహకరించలేదు.

ఇప్పుడు ఆ స్థలం విలువ 30 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో కేవలం లక్ష అపరాధ రుసుము తీసుకొని ఆ విద్యాసంస్థ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేలా గత అక్టోబరులో దస్త్రాన్ని కదిపారు. ఈ విషయం అప్పట్లో 'ఈనాడు’లో ప్రచురితమవడంతో ఉత్తర్వులిచ్చే ముందు వెనక్కి తగ్గారు. ఈ అంశం బయటకు రావడానికి కమిషనరేట్‌లోని ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ కారకుడని భావించి అతన్ని భూముల విభాగం నుంచి తప్పించారు. దేవదాయ ట్రైబ్యునల్‌కు బదిలీ చేశారు. అయిదు నెలలుగా ఆయనకు జీతం రానివ్వకుండా వేధిస్తున్నారు.

విద్యాసంస్థలతో పాటు ఆస్తులు సైతం..: ఎయిడెడ్‌ విద్యా సంస్థలను విద్యాశాఖకు అప్పగించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ పరిధిలోని కొన్ని ఎయిడెడ్‌ విద్యా సంస్థలతోపాటు, వాటి ఆస్తులను కూడా అప్పగించేలా దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజానికి చెందిన ఎయిడెడ్‌ కళాశాలతో పాటు.. 200 కోట్ల విలువైన ఆస్తులను కూడా అప్పగించేలా తొలుత ఉత్తర్వులిచ్చారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో సవరమ ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నర్సింహరావుచౌదరి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణమున్న 2.74 ఎకరాలతోపాటు, దీనికి చెందిన రూ.35 కోట్ల విలువైన 7.02 ఎకరాల పొలాన్ని కూడా విద్యాశాఖకు అప్పగించారు.

విజయనగరం జిల్లాలో పని చేసిన ఓ అధికారి.. విజయనగరంలోని మంచుకొండవారి సత్రానికి చెందిన స్థలం, భోగాపురం మండలంలోని కొమ్మూరు అప్పడుదొర ట్రస్ట్‌కు చెందిన 3.84 ఎకరాలు, నీలాయమ్మ సత్రానికి చెందిన 23.24 ఎకరాలకు NOC ఇచ్చేందుకు వీలుగా కమిషనర్‌కు నివేదికలు పంపారు. అయినా ఆయనపై కమిషనర్‌ చర్యలు తీసుకోలేదు. పత్రికల్లో కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆ అధికారిని సస్పెండ్‌ చేశారు.

ఒత్తిళ్లకు తలొగ్గి గుత్తేదారులకు అనుకూలంగా ఆదేశాలు: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో 2021లో పానకం విక్రయ టెండరును కోటీ 35 లక్షలకు ప్రహ్లాద్‌ ఎంటర్‌ప్రైజెస్‌ దక్కించుకుంది. ఆ సంస్థ కేవలం 35 లక్షలే చెల్లించింది. మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు దానిని తప్పించారు. తన సొమ్ము వెనక్కివ్వాలని గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే.. ఆలయ ఈవోదే తుది నిర్ణయమని తీర్పు వచ్చింది. ఈవో ఆ సొమ్మును ఆలయానికే చెందేలా నిర్ణయం తీసుకున్నారు. గుత్తేదారు సంస్థ ఒత్తిడికి తలొగ్గి ఆ సొమ్ము వెనక్కిచ్చేలా దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆ ఆదేశాలు ఉపసంహరించి, చివరికి ఈవో నిర్ణయానికే అంగీకారం తెలిపారు.

ఆలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు డ్రా చేయించి..: అనేక ఆలయాలు సర్వ శ్రేయోనిధి 9 శాతం, దేవదాయ పరిపాలన నిధి 8 శాతం, అర్చక సంక్షేమ నిధి 3 శాతం, ఆడిట్‌ ఫీజు 1.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఆయా దేవస్థానాలకు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను డ్రా చేసైనా వాటిని చెల్లించాలంటూ నిరుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో కొన్ని ఆలయాల అధికారులు అన్నదానం వంటి వాటి కోసం ఎఫ్‌డీ చేసిన మొత్తాన్ని కూడా డ్రా చేయాల్సి వచ్చింది. ఇలా వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయల C.G.F. నిధులను దేవదాయశాఖ అధికారులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. C.G.F నిధులు పాత ఆలయాల పునరుద్ధరణకే వినియోగించాలి. కానీ అధికారులకు కొత్త కార్ల కొనుగోళ్లు, కార్యాలయాల నిర్మాణం, మరమ్మతులు, కమిషనరేట్‌లో గోశాల నిర్మాణం, వాస్తు పేరిట నిర్మాణాలకు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు. గతేడాది కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నూతన జిల్లా దేవదాయ అధికారుల కార్యాలయాలకు, వాటిలో ఫర్నీచర్‌ కొనుగోళ్లకు వివిధ ఆలయాల C.G.F. నుంచి 63 లక్షలు కేటాయించేలా కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఒకరు హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో కమిషనర్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

వివాదాస్పద అధికారిణిపై కనికరం: ఉత్తరాంధ్రలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారిణిపై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. ఆమె పనితీరు తీవ్ర వివాదాస్పదమైనా చర్యలు తీసుకోకుండా కమిషనర్‌ ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఓ అంశంలో ఆమెతో ఉన్నతాధికారికి వివాదం తలెత్తితే, ఆయన్ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో ఆ ఉన్నతాధికారి ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొన్ని ఆలయాలకు టెండర్లు ఖరారు చేస్తూ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను ఆయన కింది అధికారి మార్చేశారు. దానిపై సైబర్‌ క్రైమ్‌ కేసు అంటూ హడావుడి చేయటమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్‌ నిర్ణయాలు ఇలా అడుగడుగునా వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఆయన తీరుతో కమిషనరేట్‌లో పాలన కూడా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తాయి. దేవాదాయశాఖలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇవీ చదవండి:

స్వామి.. నీ ఆస్తులకు దిక్కెవరు..?

HIGH COURT KEY COMMENTS ON TEMPLE LANDS: దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప.. కాపాడేవారు కరవయ్యారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. దేవాదాయ శాఖలో అధికారుల పని తీరుకు అద్దం పడుతున్నాయి. దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. కోర్టులు పదే పదే మొట్టికాయలు వేసినా.. తమ ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు.

రాజకీయ ఒత్తిళ్లకు దేవదాయశాఖ తలొగ్గుతోంది..!: పాత గుంటూరులోని కంచి కామాక్షి ఏకాంబరేశ్వరస్వామి ఆలయ ఆస్తుల జాబితాలో నమోదైన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వు జారీ చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కమిషనర్‌గా ఉండేందుకు ఆయన అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో కమిషనర్‌ పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆలయాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు దేవదాయశాఖ తలొగ్గుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

30కోట్ల రూపాయలు వదులుకునేలా..: కాకినాడ పెద్ద మార్కెట్‌లోని నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన అర ఎకరం స్థలాన్ని 2002లో బహిరంగ వేలంలో ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన విద్యాసంస్థ 34.75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 15 రోజుల్లో ఆ సొమ్ము చెల్లించి, 45 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. సొమ్ము 9నెలల వ్యవధిలో 3 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. అయితే ఆ స్థలాన్ని ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. నిబంధనల ప్రకారం ఇచ్చిన గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోపోతే.. వేలం సొమ్ముతో పాటు స్థలం ఆలయానికే చెందుతుంది. అయితే 2015 నుంచి ఆ విద్యాసంస్థ అధిపతి స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నించినా కమిషనర్లు సహకరించలేదు.

ఇప్పుడు ఆ స్థలం విలువ 30 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో కేవలం లక్ష అపరాధ రుసుము తీసుకొని ఆ విద్యాసంస్థ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేలా గత అక్టోబరులో దస్త్రాన్ని కదిపారు. ఈ విషయం అప్పట్లో 'ఈనాడు’లో ప్రచురితమవడంతో ఉత్తర్వులిచ్చే ముందు వెనక్కి తగ్గారు. ఈ అంశం బయటకు రావడానికి కమిషనరేట్‌లోని ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ కారకుడని భావించి అతన్ని భూముల విభాగం నుంచి తప్పించారు. దేవదాయ ట్రైబ్యునల్‌కు బదిలీ చేశారు. అయిదు నెలలుగా ఆయనకు జీతం రానివ్వకుండా వేధిస్తున్నారు.

విద్యాసంస్థలతో పాటు ఆస్తులు సైతం..: ఎయిడెడ్‌ విద్యా సంస్థలను విద్యాశాఖకు అప్పగించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ పరిధిలోని కొన్ని ఎయిడెడ్‌ విద్యా సంస్థలతోపాటు, వాటి ఆస్తులను కూడా అప్పగించేలా దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజానికి చెందిన ఎయిడెడ్‌ కళాశాలతో పాటు.. 200 కోట్ల విలువైన ఆస్తులను కూడా అప్పగించేలా తొలుత ఉత్తర్వులిచ్చారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో సవరమ ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నర్సింహరావుచౌదరి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణమున్న 2.74 ఎకరాలతోపాటు, దీనికి చెందిన రూ.35 కోట్ల విలువైన 7.02 ఎకరాల పొలాన్ని కూడా విద్యాశాఖకు అప్పగించారు.

విజయనగరం జిల్లాలో పని చేసిన ఓ అధికారి.. విజయనగరంలోని మంచుకొండవారి సత్రానికి చెందిన స్థలం, భోగాపురం మండలంలోని కొమ్మూరు అప్పడుదొర ట్రస్ట్‌కు చెందిన 3.84 ఎకరాలు, నీలాయమ్మ సత్రానికి చెందిన 23.24 ఎకరాలకు NOC ఇచ్చేందుకు వీలుగా కమిషనర్‌కు నివేదికలు పంపారు. అయినా ఆయనపై కమిషనర్‌ చర్యలు తీసుకోలేదు. పత్రికల్లో కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆ అధికారిని సస్పెండ్‌ చేశారు.

ఒత్తిళ్లకు తలొగ్గి గుత్తేదారులకు అనుకూలంగా ఆదేశాలు: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో 2021లో పానకం విక్రయ టెండరును కోటీ 35 లక్షలకు ప్రహ్లాద్‌ ఎంటర్‌ప్రైజెస్‌ దక్కించుకుంది. ఆ సంస్థ కేవలం 35 లక్షలే చెల్లించింది. మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు దానిని తప్పించారు. తన సొమ్ము వెనక్కివ్వాలని గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే.. ఆలయ ఈవోదే తుది నిర్ణయమని తీర్పు వచ్చింది. ఈవో ఆ సొమ్మును ఆలయానికే చెందేలా నిర్ణయం తీసుకున్నారు. గుత్తేదారు సంస్థ ఒత్తిడికి తలొగ్గి ఆ సొమ్ము వెనక్కిచ్చేలా దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆ ఆదేశాలు ఉపసంహరించి, చివరికి ఈవో నిర్ణయానికే అంగీకారం తెలిపారు.

ఆలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు డ్రా చేయించి..: అనేక ఆలయాలు సర్వ శ్రేయోనిధి 9 శాతం, దేవదాయ పరిపాలన నిధి 8 శాతం, అర్చక సంక్షేమ నిధి 3 శాతం, ఆడిట్‌ ఫీజు 1.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఆయా దేవస్థానాలకు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను డ్రా చేసైనా వాటిని చెల్లించాలంటూ నిరుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో కొన్ని ఆలయాల అధికారులు అన్నదానం వంటి వాటి కోసం ఎఫ్‌డీ చేసిన మొత్తాన్ని కూడా డ్రా చేయాల్సి వచ్చింది. ఇలా వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయల C.G.F. నిధులను దేవదాయశాఖ అధికారులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. C.G.F నిధులు పాత ఆలయాల పునరుద్ధరణకే వినియోగించాలి. కానీ అధికారులకు కొత్త కార్ల కొనుగోళ్లు, కార్యాలయాల నిర్మాణం, మరమ్మతులు, కమిషనరేట్‌లో గోశాల నిర్మాణం, వాస్తు పేరిట నిర్మాణాలకు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు. గతేడాది కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నూతన జిల్లా దేవదాయ అధికారుల కార్యాలయాలకు, వాటిలో ఫర్నీచర్‌ కొనుగోళ్లకు వివిధ ఆలయాల C.G.F. నుంచి 63 లక్షలు కేటాయించేలా కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఒకరు హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో కమిషనర్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

వివాదాస్పద అధికారిణిపై కనికరం: ఉత్తరాంధ్రలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారిణిపై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. ఆమె పనితీరు తీవ్ర వివాదాస్పదమైనా చర్యలు తీసుకోకుండా కమిషనర్‌ ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఓ అంశంలో ఆమెతో ఉన్నతాధికారికి వివాదం తలెత్తితే, ఆయన్ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో ఆ ఉన్నతాధికారి ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొన్ని ఆలయాలకు టెండర్లు ఖరారు చేస్తూ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను ఆయన కింది అధికారి మార్చేశారు. దానిపై సైబర్‌ క్రైమ్‌ కేసు అంటూ హడావుడి చేయటమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమిషనర్‌ నిర్ణయాలు ఇలా అడుగడుగునా వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఆయన తీరుతో కమిషనరేట్‌లో పాలన కూడా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తాయి. దేవాదాయశాఖలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.