ETV Bharat / state

High Court on Jagajjanani: ‘డిపాజిటర్ల చట్టం’ కింద కేసు ఎలా నమోదు చేస్తారు?.. సీఐడీని ప్రశ్నించిన హైకోర్టు

author img

By

Published : May 9, 2023, 6:55 AM IST

High Court on Jagajjanani Chits: సొమ్ములు తిరిగి చెల్లించడంపై ఏ ఒక్క డిపాజిటర్‌కు అభ్యంతరం లేనప్పుడు.. జగజ్జనని కేసులో డిపాజిటర్ల చట్టం’ఎలా వర్తిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్ట ప్రకారం ఆ సంస్థపై కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీసింది.

High Court on Jagajjanani Chits
High Court on Jagajjanani Chits

High Court on Jagajjanani Chits: సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు ‘డిపాజిటర్ల చట్టం’ ఏ విధంగా వర్తిస్తుందని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్ట ప్రకారం జగజ్జనని చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసు ఎలా నమోదు చేస్తారని వ్యాఖ్యానించింది. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు, డైరెక్టర్‌ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. చిట్‌ నిర్వహణలో ఏదైనా లోపాలను చిట్‌ సహాయ రిజిస్ట్రార్‌ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్‌ వ్యవహరించారన్నారు. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషన్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందన్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీలలో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు.

చిన్న లోపాలు ఏమైనా చోటు చేసుకుంటే అవి చిట్‌ ఫండ్‌ చట్ట పరిధిలోకి వస్తాయన్నారు. ‘డిపాజిటర్ల చట్టం’ వర్తించదన్నారు. సొమ్ము తిరిగి చెల్లింపు వ్యవహారంపై ఏ ఒక్క చందాదారుకు అభ్యంతరం లేదన్నారు. గతంలో విచారణ నిమ్తితం అధికారులు పిలిస్తే పిటిషనర్‌ వెళ్లి సహకరించారన్నారు. అరెస్ట్‌ విషయంలో తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పట్టించుకోలేదన్నారు. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను దిగువ కోర్టు తోసిపుచ్చిందన్నారు. రికార్డులన్ని ఇప్పటికే చిట్‌ రిజిస్ట్రార్ల వద్ద ఉన్నాయన్నారు. దర్యాప్తు పేరుచెప్పి పిటిషనర్లను జెల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు.

ఐపీసీ సెక్షన్‌ 409, డిపాజిటర్ల చట్టం సెక్షన్‌ 5 ఈ కేసుకు వర్తించదన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బెయిలు ఇవ్వొద్దని కోరారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు డిపాజిటర్ల చట్టం ఏవిధంగా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. చందాదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులేట్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

ఇవీ చదవండి:

High Court on Jagajjanani Chits: సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు ‘డిపాజిటర్ల చట్టం’ ఏ విధంగా వర్తిస్తుందని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్ట ప్రకారం జగజ్జనని చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసు ఎలా నమోదు చేస్తారని వ్యాఖ్యానించింది. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు, డైరెక్టర్‌ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. చిట్‌ నిర్వహణలో ఏదైనా లోపాలను చిట్‌ సహాయ రిజిస్ట్రార్‌ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్‌ వ్యవహరించారన్నారు. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషన్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందన్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీలలో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు.

చిన్న లోపాలు ఏమైనా చోటు చేసుకుంటే అవి చిట్‌ ఫండ్‌ చట్ట పరిధిలోకి వస్తాయన్నారు. ‘డిపాజిటర్ల చట్టం’ వర్తించదన్నారు. సొమ్ము తిరిగి చెల్లింపు వ్యవహారంపై ఏ ఒక్క చందాదారుకు అభ్యంతరం లేదన్నారు. గతంలో విచారణ నిమ్తితం అధికారులు పిలిస్తే పిటిషనర్‌ వెళ్లి సహకరించారన్నారు. అరెస్ట్‌ విషయంలో తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పట్టించుకోలేదన్నారు. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను దిగువ కోర్టు తోసిపుచ్చిందన్నారు. రికార్డులన్ని ఇప్పటికే చిట్‌ రిజిస్ట్రార్ల వద్ద ఉన్నాయన్నారు. దర్యాప్తు పేరుచెప్పి పిటిషనర్లను జెల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు.

ఐపీసీ సెక్షన్‌ 409, డిపాజిటర్ల చట్టం సెక్షన్‌ 5 ఈ కేసుకు వర్తించదన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బెయిలు ఇవ్వొద్దని కోరారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు డిపాజిటర్ల చట్టం ఏవిధంగా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. చందాదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులేట్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.