రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదలకు 2 సెంట్లకు తగ్గకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నిరాహార దీక్షకు దిగారు. వినుకొండలోని తన నివాసంలో నిరసన చేపట్టారు. పేదలకు వినుకొండ పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. అటవీ ప్రాంతంలో స్థలాలు వద్దని.. వెల్లటూరు రోడ్డులోని గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..