గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జేసీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. "ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయాలని చెప్పాము కదా...ఎందుకు చేయటం లేదు. మీ డాక్టర్ ఎక్కడ ఉన్నారు...ఎందుకు పరీక్షలు చేయటం లేదు" అని సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆసుపత్రి వైద్యాధికారి గురించి జిల్లా వైద్యాధికారి యాస్మిన్కు ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఆసుపత్రి వైద్యాధికారి సెలవులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె...ఇక నుంచి పరీక్షలు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు. వారానికి కనీసం 250 అర్జీల సమస్యలు పరిష్కారించాలని సూచించారు.
ఇదీచదవండి