కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ కారణంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోటలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పంటలకు ప్రభుత్వం నామమాత్రపు మద్దతు ధర ఇచ్చి.. కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరి వద్ద పంట కొనుగోలు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి.. రైతు భరోసా కేంద్రానికి వైకాపా రంగులు.. తెదేపా అభ్యంతరం