ETV Bharat / state

ముంచెత్తిన కృష్ణమ్మ.. భయాందోళనలో తీరప్రాంత వాసులు - రేపల్లెలో వరద

కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లిపాలెం గ్రామాన్ని వరద ముంచెత్తింది. స్థానికులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు.

flood at repalli
ముంచెత్తిన కృష్ణమ్మ.. భయాందోళనలో తీరప్రాంత వాసులు
author img

By

Published : Sep 28, 2020, 12:39 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె మండలం కృష్ణానది సమీపంలోని పల్లిపాలెం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఇప్పటికే కొన్ని ఇళ్లు నీళ్లలో మునిగాయి. దీంతో గ్రామంలోని స్థానికులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్రమేపి వరద నీరు పెరుగుతుండటంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు.

వరద నీరు వచ్చిన ప్రతిసారి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని..అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం కృష్ణానది సమీపంలోని పల్లిపాలెం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఇప్పటికే కొన్ని ఇళ్లు నీళ్లలో మునిగాయి. దీంతో గ్రామంలోని స్థానికులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్రమేపి వరద నీరు పెరుగుతుండటంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు.

వరద నీరు వచ్చిన ప్రతిసారి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని..అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.