ETV Bharat / state

తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతుల ఆందోళన - తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతులు ఆందోళన చేపట్టారు. పంట కొనుగోళ్లలో ఆన్​లైన్​ విధానం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయారు. దీనిపై మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ హామీ ఇచ్చారు.

మార్కెట్​ యార్డ్​ వద్ద రైతుల ఆందోళన
author img

By

Published : Oct 28, 2019, 7:50 PM IST

తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ యార్డు వద్ద నిమ్మ రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోళ్లలో ఆన్​లైన్​ విధానం తప్పులతడకగా ఉందంటూ నిరసన చేపట్టారు. దీనిని పట్టించుకోని అధికారులు సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ రాకతో... కర్షకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తెచ్చిన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మార్కెటింగ్​ శాఖ జేడీ రామాంజనేయులు అన్నారు. సమస్య పరిష్కరించే దిశగా మంత్రి, కమిషనర్​తో చర్చలు జరుపుతానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ హామీ ఇచ్చారు.

తెనాలి మార్కెట్​ యార్డ్​ వద్ద నిమ్మ రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ యార్డు వద్ద నిమ్మ రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోళ్లలో ఆన్​లైన్​ విధానం తప్పులతడకగా ఉందంటూ నిరసన చేపట్టారు. దీనిని పట్టించుకోని అధికారులు సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ రాకతో... కర్షకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం తెచ్చిన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మార్కెటింగ్​ శాఖ జేడీ రామాంజనేయులు అన్నారు. సమస్య పరిష్కరించే దిశగా మంత్రి, కమిషనర్​తో చర్చలు జరుపుతానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

'ఇసుగించొద్దు... పని కల్పించండి...'

Reporter : j.sivakumar Rayadurgam Anantapuram, dist, ap 8008573082 * దుర్గం లో భారీ వర్షం స్తంభించిన జనజీవనం ఆనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాయదుర్గం పట్టణం మండలంతో పాటు డి హిరేహాల్, కనేకల్, గుమ్మగట్ట, బొమ్మనహల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బొమ్మనహల్ మండలం లో 104.6 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది భారీ వర్షం రావడంతో బొమ్మనహల్ తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, మండల వనరుల కేంద్రం, విద్యుత్ కార్యాలయం, శ్రీ శక్తి భవన్, జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్తిగా వర్షం నీటితో మునిగాయి. పత్తి వరి మిరప పంట పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షం దెబ్బకు ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం తెరుచుకో లేని పరిస్థితి నెలకొంది బొమ్మనహల్ మండలం లో లో లో 5 వేల నుంచి ఆరువేల ఎకరాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, మిరప వంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దాదాపు రెండు రెండు నుంచి మూడు కోట్లు దాకా రైతులు వివిధ పంటల వల్ల నష్టపోయారు మండల కేంద్రానికి ప్రయాణికులు రాకపోకలు సాగించే వ్యవస్థ దెబ్బతింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అదేవిధంగా గుమ్మగట్ట మండల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయింది. కలుగోడు జే వెంకటం పల్లి తో పాటు ఇతర చెరువులు వాగులు వంకలు వరద నీటితో మునిగిపోయాయి. రహదారులు కోతకు గురికావడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.