CRDA: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఫ్లాట్లలోని అభివృద్ధి పనులకు సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 23 కోట్ల రూపాయలతో ఎంఐజి ప్లాట్లలో.. సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారులు, మురుగుకాలువల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం వల్ల పనులు ఆగాయని.. తగ్గిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని కమిషనర్ వెల్లడించారు.
ఇవీ చదవండి: