ETV Bharat / state

కోడలే... కొడుకై అంత్యక్రియలు నిర్వహించింది

author img

By

Published : Sep 24, 2020, 10:06 PM IST

ఆస్తి వివాదాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి అనడానికి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనే నిరదర్శం. కన్న తల్లిని కడసారి సాగనంపేకు కూడా కనికరం లేకుండా చేసింది. కూతుళ్లు, మనవళ్లు ఉండి కూడా కోడలే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

daughter in law conduct her mother in law funeral at kakumunu village in Guntur district
కోడలే... కొడుకై అంత్యక్రియల నిర్వహణ

ఏ తల్లిదండ్రులైనా తాము మరణించాక కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాలని అనుకుంటున్నారు. అయిన వాళ్లు ఉండి కూడా ఆ తల్లి అందుకు నోచుకోలేదు. కోడలే... కొడుకై అత్తకు అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కాకుమానులో మున్నంగి నాగరత్నంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు సంతాపం. ఆమె భర్త గతంలో చనిపోగా.. ఉన్న ఒక్కగానొక్క కొడుకూ ఆస్తి వివాదంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగరత్నం ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమె మృతి చెందారు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నప్పటికీ ఆస్తి వివాదాల కారణంగా ఎవ్వరూ రాలేదు. దీంతో చివరకు కోడలే ఆ తల్లికి తలకొరివి పెట్టారు. రక్తసంబంధికులు అందరూ ఉండి కూడా కోడలు తలకొరివి పెట్టాల్సి వచ్చింది అని స్థానికులు అశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏ తల్లిదండ్రులైనా తాము మరణించాక కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాలని అనుకుంటున్నారు. అయిన వాళ్లు ఉండి కూడా ఆ తల్లి అందుకు నోచుకోలేదు. కోడలే... కొడుకై అత్తకు అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కాకుమానులో మున్నంగి నాగరత్నంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు సంతాపం. ఆమె భర్త గతంలో చనిపోగా.. ఉన్న ఒక్కగానొక్క కొడుకూ ఆస్తి వివాదంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగరత్నం ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమె మృతి చెందారు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నప్పటికీ ఆస్తి వివాదాల కారణంగా ఎవ్వరూ రాలేదు. దీంతో చివరకు కోడలే ఆ తల్లికి తలకొరివి పెట్టారు. రక్తసంబంధికులు అందరూ ఉండి కూడా కోడలు తలకొరివి పెట్టాల్సి వచ్చింది అని స్థానికులు అశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఏపీఐఐసీ భూములు సోలార్ సంస్థకు అప్పగిస్తూ జీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.