ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

author img

By

Published : Jun 14, 2020, 7:02 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం మరో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 645కు చేరింది.

corona cases raised in guntur district
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 645కు చేరింది. ఆదివారం వచ్చిన ఫలితాలలో 14 కొత్త కేసులు బయటపడ్డాయి... గుంటూరులో 3, నరసరావుపేటలో 3, తాడేపల్లిలో 3, చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోని సంపత్​నగర్, కోబాల్ట్ పేటలో కొత్తగా కేసులు రాగా, ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్థులకు కరోనా సోకింది. మాదలలో కరోనా పాజిటివ్ సోకిన ఒక మహిళకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించటంతో వారిని క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభణ : రెండు రోజులు..29 కేసులు !

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 645కు చేరింది. ఆదివారం వచ్చిన ఫలితాలలో 14 కొత్త కేసులు బయటపడ్డాయి... గుంటూరులో 3, నరసరావుపేటలో 3, తాడేపల్లిలో 3, చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోని సంపత్​నగర్, కోబాల్ట్ పేటలో కొత్తగా కేసులు రాగా, ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్థులకు కరోనా సోకింది. మాదలలో కరోనా పాజిటివ్ సోకిన ఒక మహిళకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించటంతో వారిని క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభణ : రెండు రోజులు..29 కేసులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.