ETV Bharat / state

CM Jagan: ఆత్మకూరులో కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం

author img

By

Published : Feb 18, 2022, 1:09 PM IST

Updated : Feb 18, 2022, 1:32 PM IST

cm jagan guntur tour : గుంటూరు జిల్లా ఆత్మకూరులో అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొడంలో ఇస్కాన్‌ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు.

cm jagan guntur tour
cm jagan guntur tour

cm jagan guntur tour : గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో భారీ వంటశాలను అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించింది. ఇక్కడ కేవలం 2 గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసే అవకాశం ఉంది. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందజేస్తోంది. వంటశాల, భోజనం ప్యాకింగ్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు

ఆత్మకూరులో కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం

గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ

cm jagan guntur tour : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొడంలో ఇస్కాన్‌ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. రూ.70కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి :

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

cm jagan guntur tour : గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో భారీ వంటశాలను అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించింది. ఇక్కడ కేవలం 2 గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసే అవకాశం ఉంది. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందజేస్తోంది. వంటశాల, భోజనం ప్యాకింగ్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు

ఆత్మకూరులో కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం

గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ

cm jagan guntur tour : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొడంలో ఇస్కాన్‌ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. రూ.70కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి :

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Last Updated : Feb 18, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.