ETV Bharat / state

రైతును అన్ని విధాలా ఆదుకుంటేనే.. ఏ రాష్ట్రమైనా బాగుంటుంది: సీఎం జగన్​ - YSR ZERO INTEREST

CM RELASED YSR ZERO INTEREST LOANS : వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని సీఎం జగన్​ అన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలను సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

CM RELASED YSR ZERO INTEREST LOANS
CM RELASED YSR ZERO INTEREST LOANS
author img

By

Published : Nov 28, 2022, 2:50 PM IST

Updated : Nov 28, 2022, 3:51 PM IST

CM JAGAN RELEASED INPUT SUBSIDY : 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారని సీఎం జగన్​ తెలిపారు. రైతును అన్నివిధాలా ఆదుకుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలను సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్​ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే.. అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు.

మొత్తం రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్న సీఎం.. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామన్నారు. 8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. ఏడాదిలోపు చెల్లించిన రైతులకు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా ద్వారా మూడేళ్లలో రూ.25,971 కోట్లు.. బీమా సొమ్ము రూపంలో రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు.

"వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం జమ చేస్తున్నాం. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం అందిస్తున్నాం. రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీ రాయితీ ఇస్తున్నాం"-సీఎం జగన్​

రైతును అన్ని విధాలా ఆదుకుంటేనే.. ఏ రాష్ట్రమైనా బాగుంటుంది

ఇవీ చదవండి:

CM JAGAN RELEASED INPUT SUBSIDY : 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారని సీఎం జగన్​ తెలిపారు. రైతును అన్నివిధాలా ఆదుకుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలను సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్​ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే.. అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు.

మొత్తం రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్న సీఎం.. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామన్నారు. 8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. ఏడాదిలోపు చెల్లించిన రైతులకు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా ద్వారా మూడేళ్లలో రూ.25,971 కోట్లు.. బీమా సొమ్ము రూపంలో రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు.

"వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం జమ చేస్తున్నాం. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం అందిస్తున్నాం. రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీ రాయితీ ఇస్తున్నాం"-సీఎం జగన్​

రైతును అన్ని విధాలా ఆదుకుంటేనే.. ఏ రాష్ట్రమైనా బాగుంటుంది

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.