ETV Bharat / state

కొత్త కూలీ ధరల అమలుకు పౌర సరఫరాల హమాలీల డిమాండ్ - పౌర సరఫరాల హమాలీలపై వార్తలు

గుంటూరులో పౌర సరఫరాల హమాలీలు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన కూలీ రేట్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత రేటు గత డిసెంబర్ తోనే ముగిసినా ఇప్పటివరకు కొత్త ధరలు అమల్లోకి తేలేదని ఆగ్రహించారు.

civil supply labours protest at guntur
గుంటూరులో పౌర సరఫరాల హమాలీల నిరసన
author img

By

Published : Aug 27, 2020, 8:09 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో పౌర సరఫరాల హమాలీలు నిరసన చేపట్టారు. రెండో రోజు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీ రేటు గత డిసెంబర్ నాటికే ముగిసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ధరలు అమలు చేయలేదని వాపోయారు.

కరోనా విపత్తులోనూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వం అందించే రేషన్ సరకులను ప్రజలకు చేరువ చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెలూగురి రాధాకృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జనవరి 2020 నుంచి పెంచిన నూతన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలన్నారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో పౌర సరఫరాల హమాలీలు నిరసన చేపట్టారు. రెండో రోజు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీ రేటు గత డిసెంబర్ నాటికే ముగిసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ధరలు అమలు చేయలేదని వాపోయారు.

కరోనా విపత్తులోనూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభుత్వం అందించే రేషన్ సరకులను ప్రజలకు చేరువ చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెలూగురి రాధాకృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జనవరి 2020 నుంచి పెంచిన నూతన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలన్నారు.

ఇదీ చదవండి:

ప్రైవేట్​ ల్యాబ్​లో కరోనా నిర్థరణ పరీక్ష ధర రూ.1900

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.