ETV Bharat / state

ఇసుక క్వారీలు తెరవాలని కార్మికుల దీక్ష - Building Construction Labour

ఇసుక క్వారీలు తెరవాలని... గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో కార్మికులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఇసుక క్వారీలు తెరవాలని కార్మికుల దీక్ష
author img

By

Published : Jul 30, 2019, 5:18 PM IST

ఇసుక క్వారీలు తెరవాలని కార్మికుల దీక్ష

ఇసుక క్వారీలను తెరిచి... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సత్తెనపల్లిలో తాలూకా సెంటర్​లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ... 5 నెలలుగా ఇసుక క్వారీలు మూసివేయడంతో... కార్మికులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కనీసం నిత్యావసరాలు తీర్చుకునే స్థితిలోనూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వారీలను తెరిచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ముందు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.

ఇదీ చదవండీ.. సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?

ఇసుక క్వారీలు తెరవాలని కార్మికుల దీక్ష

ఇసుక క్వారీలను తెరిచి... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సత్తెనపల్లిలో తాలూకా సెంటర్​లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ... 5 నెలలుగా ఇసుక క్వారీలు మూసివేయడంతో... కార్మికులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కనీసం నిత్యావసరాలు తీర్చుకునే స్థితిలోనూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వారీలను తెరిచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ముందు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.

ఇదీ చదవండీ.. సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?

ముఖ్యమంత్రి గారు శనగ రైతుల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టు కొండి తింటాను ధర 6120 చొప్పున ప్రభుత్వమే కొనాలి తులసి రెడ్డి అన్నారు. వేంపల్లి లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేకించి కడప జిల్లాలో లో బుడ్డ సెనగ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. గత మూడు సంవత్సరాలుగా బుడ్డ శనగకు గిట్టుబాటు ధర లేక ధర వస్తుందన్న ఆశతో రైతులు అమ్ముకోకుండా ఇండ్లల్లో నిల్వ చేస్తున్నారు. దీనికి తోడు అధికారంలోకి వస్తే కింటా కు 6500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైకాపా పార్టీ నాయకులు చెప్పడంతో రైతులు నమ్మకంతో అలాగే నిల్వ చేస్తున్నారు ఒకవైపు పురుగు పడుతున్న తరుగు పెరుగుతున్న ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసాతో రైతులు అలాగే నిల్వ ఉంచుతున్నారు వైకాపా అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఒక క్వింటాలు సెనగలు కొనక పోవడం శోచనీయం. రైతులు అమ్ముకుంటే కింటాలు మీద ప్రభుత్వం అదనంగా రూ 1500 ఇస్తుందని అది కూడా గోడౌన్లలోనే నిల్వ చేసుకున్న రైతులు కు మాత్రమే అని అది కూడా ఒక రైతుకు 5 ఎకరాలు వరకే అని అది కూడా గరిష్టంగా ఒక రైతుకు 30 క్వింటాళ్లు మాత్రమే అని అది కూడా ఒక సంవత్సరం మాత్రమే అని వైకాపా ప్రభుత్వం షరతులు విధించడం తో తో రైతులు లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కింటాలు 4620 అని అని దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వమ ప్రకటించిన మొత్తం ఒకటి ఐదు సున్నా సున్నా కలిపి క్వింటాలు ధర 6120 అవుతుందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ ద్వారా గాని ఇతర ప్రభుత్వాల ఏజెన్సీల ద్వారా గాని క్వింటాలు ధర 6120 చొప్పున ఎలాంటి షరతులు లేకుండా రైతుల ఇళ్లలో గోడౌన్లలో ఉన్న బుడ్డ శనగలు కొనాలని రైతులను ఆదుకోవాలని మాట నిలబెట్టుకోవాలని రాస్తా కాంగ్రెస్ ఎస్ పి సి ఉపాధ్యక్షుడు రెడ్డి తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.