గుంటూరులో బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించుకోవటం సంతోషదాయకమని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. సొసైటీ ద్వారా నిరుపేద బ్రాహ్మణుల అభివృద్ధికి అవకాశం కలిగిందని చెప్పారు. ఈ సొసైటీలో 53 వేల మంది షేర్ హోల్డర్లుగా నమోదు అయ్యారని.. రానున్న 5 సంవత్సరాలలో లక్షమందిని చేర్పించేలా ముందుకు సాగుతామని చెప్పారు. బ్రాహ్మణులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ భవన్ నిర్మించి అన్ని రకాల కార్యక్రమాలకు ఒక్కటే వేదికగా మార్చుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా పాల్గొన్నారు.
ఇదీ చూడండి