ETV Bharat / state

'ఒక్క రోడ్డు వేయని ప్రభుత్వం.. 3 రాజధానులు నిర్మిస్తుందా' - అమరావతి ఆందోళనల వార్తలు

ఇప్పటివరకూ ఒక్క రహదారినైనా వేయని ప్రభుత్వం.. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందంటూ అమరావతి రైతులు ప్రశ్నించారు. 307వ రోజు దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

amaravathi protest
అమరావతి ఆందోళనలు
author img

By

Published : Oct 19, 2020, 7:18 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 307వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, ఐనవోలు, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల్లో ఆందోళనలు కొనసాగించారు.

అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇప్పటివరకు ఒక్క రహదారినైనా వేయని ప్రభుత్వం 3 రాజధానులను ఎలా నిర్మిస్తుందని రైతులు నిలదీశారు. నీరుకొండలో పాదయాత్ర నిర్వహించారు. ఆకుపచ్చ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. దొండపాడులో పసుపు-కుంకుమార్చన పూజలు చేశారు.

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 307వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, ఐనవోలు, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల్లో ఆందోళనలు కొనసాగించారు.

అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇప్పటివరకు ఒక్క రహదారినైనా వేయని ప్రభుత్వం 3 రాజధానులను ఎలా నిర్మిస్తుందని రైతులు నిలదీశారు. నీరుకొండలో పాదయాత్ర నిర్వహించారు. ఆకుపచ్చ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. దొండపాడులో పసుపు-కుంకుమార్చన పూజలు చేశారు.

ఇవీ చదవండి..

తెదేపా బీసీల అభ్యున్నతికి కృషిచేస్తోంది: కాలవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.