ఫ్రాన్స్ పౌర పురస్కారం పశ్చిమబంగ వాసిని వరించింది. బంగాల్కు చెందిన క్రైస్తవ మిషనరీ ఫాదర్ ఫ్రాంకోయిస్ లాబోర్డేను ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం లీజియన్ డీ ఆనర్కు ఎంపిక చేసినట్లు ఆ దేశం ప్రకటించింది. భారత్లో ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జాండ్రే జీగ్లర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
దివ్యాంగులు, నిరుపేదల అభ్యున్నతికి ఫ్రాంక్ చేసిన సేవల్ని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు ఫ్రాన్స్ ప్రతినిధి.
"దివ్యాంగుల అభ్యున్నతికి ఆయన 60 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. 92 ఏళ్ల వయసులోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత"-అలెగ్జాండ్రే జీగ్లర్, ఫ్రాన్స్ అంబాసిడర్.
ఆయన పనిచేసే చోటనున్న చిన్నారులకు ఆ పురస్కారాన్ని అంకితమిచ్చారు ఫ్రాంక్. గతంలో ఫ్రాన్స్ పౌరుడే అయినప్పటికీ భారత్కు మిషన్ సేవల కోసం వచ్చిన తర్వాత భారత పౌరసత్వం పొందారు.
ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే, నటుడు సౌమిత్ర ఛటర్జీ తర్వాత ఫ్రాన్స్ పౌర పురస్కారాన్ని పొందిన భారతీయుడు ఫ్రాంక్.