తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కూతురు మృతిచెందారు. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పెనుపోతుల మేరీ (40) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందింది. మేరీ మరణవార్త విన్న తల్లీ పెనుబోతుల బూరమ్మ (60) ఆపస్మారక స్థితిలోకి పోయింది. నాలుగు రోజులుగా షాక్లో ఉన్న బూరమ్మ.. గతరాత్రి గుండెపోటుతో మృతిచెందింది.
ఇదీ చదవండీ... బ్లాక్ ఫంగస్: లక్షణాలు.. నిర్ధరణ.. చికిత్స ఏంటంటే?