ETV Bharat / state

అల్లూరి చదివిన పాఠశాల... సమస్యలతో విలవిల - రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్తలు

115 ఏళ్ల ఘన ప్రస్థానమున్న పాఠశాల... ఉనికి కోసం పోరాడుతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విద్యాభ్యాసం చేసిన ప్రాంగణం.... నేడు శిథిలావస్థకు చేరుకుంది. మరెందరో మహనీయులకు ఓనమాలు నేర్పిన ఆ చదువుల గుడి....ఆదరణ కోసం ఎదురుచూస్తోంది.

అల్లూరి
author img

By

Published : Oct 19, 2019, 11:42 AM IST

Updated : Oct 19, 2019, 1:01 PM IST

అల్లూరి చదివిన పాఠశాల... సమస్యలతో విలవిల

తూర్పుగోదావరి జిల్లా తునిలోని రాజా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలది ఘనమైన చరిత్ర. 1904లో తుని రాజు రాజా వెంకట సింహాద్రి జగపతి రాజు బహదూర్ ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే వాస్తు, సంప్రదాయాలను పాటిస్తూ 35 పెద్ద పెద్ద గదులతో సువిశాల ప్రాంగణంలో ఆంగ్ల అక్షరం 'T' ఆకారంలో దీనిని నిర్మించారు. స్వతంత్ర సంగ్రామంలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాలుగో తరగతి ఈ పాఠశాలలోనే చదివారు. ఆయన బడిలో చేరిన తేది, ఇతర వివరాలు ఇప్పటికీ రిజిష్టర్‌లో పదిలంగా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న పూర్వవిద్యార్థుల ఫోటోలు, వివరాలను జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.

క్షణక్షణం భయం భయం

1969లో ఈ భవనంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైంది. ఇక్కడ చదివిన అనేకమంది దేశవిదేశాల్లో ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇలా ఎంతోమందిని గొప్పవారిగా తీర్చిదిద్దిన ఈ కట్టడం నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. భవనం పైకప్పు, స్తంభాలు బీటలు వారి పెచ్చులూడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా నీరు గదుల్లో వస్తోంది. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాఠశాల, కళాశాలలో చదువుతున్న వెయ్యిమంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. భవనం దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, వారి చర్యల కోసం ఎదురుచూస్తున్నామని కళాశాల ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.

పూర్వవిద్యార్థులు అందిస్తున్న సాయం ఈ కళాశాలకు గత వైభవం తీసుకొచ్చేందుకు సరిపోవటం లేదు. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఇది అసాధ్యమేమీ కాదని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.

అల్లూరి చదివిన పాఠశాల... సమస్యలతో విలవిల

తూర్పుగోదావరి జిల్లా తునిలోని రాజా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలది ఘనమైన చరిత్ర. 1904లో తుని రాజు రాజా వెంకట సింహాద్రి జగపతి రాజు బహదూర్ ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే వాస్తు, సంప్రదాయాలను పాటిస్తూ 35 పెద్ద పెద్ద గదులతో సువిశాల ప్రాంగణంలో ఆంగ్ల అక్షరం 'T' ఆకారంలో దీనిని నిర్మించారు. స్వతంత్ర సంగ్రామంలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాలుగో తరగతి ఈ పాఠశాలలోనే చదివారు. ఆయన బడిలో చేరిన తేది, ఇతర వివరాలు ఇప్పటికీ రిజిష్టర్‌లో పదిలంగా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న పూర్వవిద్యార్థుల ఫోటోలు, వివరాలను జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.

క్షణక్షణం భయం భయం

1969లో ఈ భవనంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైంది. ఇక్కడ చదివిన అనేకమంది దేశవిదేశాల్లో ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇలా ఎంతోమందిని గొప్పవారిగా తీర్చిదిద్దిన ఈ కట్టడం నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. భవనం పైకప్పు, స్తంభాలు బీటలు వారి పెచ్చులూడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా నీరు గదుల్లో వస్తోంది. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాఠశాల, కళాశాలలో చదువుతున్న వెయ్యిమంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. భవనం దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, వారి చర్యల కోసం ఎదురుచూస్తున్నామని కళాశాల ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.

పూర్వవిద్యార్థులు అందిస్తున్న సాయం ఈ కళాశాలకు గత వైభవం తీసుకొచ్చేందుకు సరిపోవటం లేదు. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఇది అసాధ్యమేమీ కాదని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_18_115_years_scool_alluri_sidilam_p_v_raju_pkg_R_VOI_AP10025 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విద్యాభ్యాసం చేసిన పాఠశాల ప్రాంగణం... ఎందరో ఉన్నత స్థాయి లో ఉన్న ప్రముఖులు చదివిన విద్యాలయం... బ్రిటిష్ కాలంలో 115 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం... ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది తూర్పుగోదావరి జిల్లా తుని రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల... తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో 1904లో తుని రాజా వారు రాజా వెంకట సింహాద్రి జగపతి రాజు బహుద్దురు పాఠశాల భవనాన్ని నిర్మించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 4వ తరగతి ఈ పాఠశాల లొనే చదివారు. అప్పట్లో ఆయన పాఠశాలలో చేరిన తేదీ, పేరు తదితర వివరాలు నేటికి రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి.1969లో ఈ భవనంలో రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో, కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో అనేక ఉన్నత పదవుల్లో, ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ రోజుల్లో వాస్తు తదితర సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నత మేధావి వర్గంతో 35 పెద్ద పెద్ద గదులు, వరండాలతో ఆంగ్ల అక్షరం టి ఆకారంలో భవనాన్ని నిర్మించారు. సున్నం, కలబంద మిశ్రమాన్ని గానుగ చేసి వినియోగించారని , భవనం లో కలప, ఇనుప గడ్డర్లు బర్మా దేశం నుంచి నౌకలో దిగుమతి చేసారని పెద్దలు చెబుతున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ చారిత్రక కట్టడం నేడు కష్టాల్లో కొట్టు మిట్టాడుతుంది. భవనం పై కప్పు కారిపోయి, స్తంభాలు బీటలు వారి, పీచులుడి పడుతున్నాయి. దీంతో ప్రమాద కరంగా ఉంది. ఈ కళాశాల, పాఠశాలలో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థుల బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లబుచుతున్నారు. బైట్. 1, 2 3 భవనం దుస్థితి పై ఉన్నతాధికారులకు నివేదిక పంపమని ప్రిన్సిపాల్ తెలిపారు. బైట్. ఆర్. రామకృష్ణ, ప్రిన్సిపాల్. ఫైనల్ వాయిస్ ఓవర్: ఈ చరిత్ర క కట్టడాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Conclusion:ఓవర్...
Last Updated : Oct 19, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.