ETV Bharat / state

'తెదేపా నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - news on tdp leaders protest in eastgodavari

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ గోకవరంలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. తమపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

tdp leaders protested in gokavaram
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న తెదేపా నాయకులు
author img

By

Published : Jun 13, 2020, 12:05 PM IST

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దేవిచౌక్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దేవిచౌక్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

ఇదీ చూడండి: అచ్చెన్నాయుడి అరెస్ట్ కక్షసాధింపే: రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.