తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ భయంతో ప్రజలు జీవిస్తున్నారని.. భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ సమావేశాల శూన్యగంటలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గ్యాస్ లీకేజీ అయినప్పుడు అక్కడి ప్రజలు కనీసం వంట కూడా చేసుకోలేకపోయారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఓఎన్జీసీ ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: