ETV Bharat / state

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా

author img

By

Published : May 4, 2021, 10:46 AM IST

Updated : May 4, 2021, 4:18 PM IST

సంగం ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా సోకినట్లు.. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఇవాళ గురునాథం, ధూళిపాళ్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి ల్యాబ్​కు పంపగా.. ఫలితాలు రేపు వెల్లడి కానున్నట్లు తెలిపారు.

sangam dairy
సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగం ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా సోకినట్లు.. జైలు సూపరింటెండెంట్ తెలిపారు. గోపాలకృష్ణన్​కు సోమవారం రాత్రి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుత్రిలో చికిత్స అందిస్తున్న స్పష్టం చేశారు.

ఇవాళ గురునాథం, ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించి.. కాకినాడ ల్యాబ్​కు పంపినట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఫలితాలు రేపు ఉదయం వస్తాయన్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

గోపాలకృష్ణన్​ను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలి

కరోనా బారిన పడిన గోపాలకృష్ణన్​కు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ..ఆయన కుటుంబ సభ్యులు అనిశా కోర్టును ఆశ్రయించారు. ఆయనను కార్పోరేటు ఆసుపత్రికి తరలించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా...కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు.

ఇదీ చదవండి:

నేడు సీఐడీ విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమ

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగం ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా సోకినట్లు.. జైలు సూపరింటెండెంట్ తెలిపారు. గోపాలకృష్ణన్​కు సోమవారం రాత్రి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుత్రిలో చికిత్స అందిస్తున్న స్పష్టం చేశారు.

ఇవాళ గురునాథం, ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పరీక్షలు నిర్వహించి.. కాకినాడ ల్యాబ్​కు పంపినట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఫలితాలు రేపు ఉదయం వస్తాయన్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

గోపాలకృష్ణన్​ను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలి

కరోనా బారిన పడిన గోపాలకృష్ణన్​కు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ..ఆయన కుటుంబ సభ్యులు అనిశా కోర్టును ఆశ్రయించారు. ఆయనను కార్పోరేటు ఆసుపత్రికి తరలించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా...కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు.

ఇదీ చదవండి:

నేడు సీఐడీ విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమ

Last Updated : May 4, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.