ETV Bharat / state

అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి - అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

తెల్లవారుజామున వేగంగా ప్రయాణిస్తున్న కారు డివైడర్​ను ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగింది. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

road accident at annavaram
అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 16, 2020, 11:58 AM IST

అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో నలుగురు వ్యక్తులు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో డివైడర్​ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో అన్నదమ్ములు ఉండగా.. అన్న మృతి చెందాడు. తమ్ముడుకి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనవారు అమలాపురం సమీపంలోని అమ్మాజీపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పవన్, శివల మృతదేహాలను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

మంచు కురిసే వేళలో... కోనసీమ అందాలు

అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో నలుగురు వ్యక్తులు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంతో డివైడర్​ను ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో అన్నదమ్ములు ఉండగా.. అన్న మృతి చెందాడు. తమ్ముడుకి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనవారు అమలాపురం సమీపంలోని అమ్మాజీపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పవన్, శివల మృతదేహాలను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

మంచు కురిసే వేళలో... కోనసీమ అందాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.