ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Dec 13, 2019, 4:25 PM IST

ప్రేమించాడు. పెద్దలను ఒప్పించాడు. అందరి అంగీకారంతో ఆమెను వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆదిలో అన్నీ ఆనందాలే! ఆ తర్వాత ప్రేమ కాస్త ద్వేషంగా మారింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలోని బోయినపల్లిలో జరిగిన ఘటన వివరాలివి..!

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట్రావు, లక్ష్మిలు చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్​ వచ్చి స్థిరపడ్డారు. కొన్నినెలల క్రితం వరకూ తెలంగాణలోని ఫతేనగర్​లో ఉండేవారు. ఇటీవలే బోయినపల్లిలోని కంసాలి బజార్​కు వచ్చారు.

ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు...

వెంకట్రావు కుమారుడు భాస్కర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బంధువులకు చెందిన ప్లాస్టిక్ మోడలింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను కుత్బుల్లాపూర్​లోని ఓ యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు...

భాస్కర్ వివాహం అనంతరం సరిగా విధులకు వెళ్లడం లేదు. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈనెల 11వ తేదీన తన భార్యను పుట్టింటికి పంపించిన అతను తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు.

అర్ధరాత్రి సమయంలో...

భార్య దూరంగా ఉండడం వల్ల మనస్తాపానికి గురైన భాస్కర్ రాత్రి​ సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు అతన్ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ.. అతను అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట్రావు, లక్ష్మిలు చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్​ వచ్చి స్థిరపడ్డారు. కొన్నినెలల క్రితం వరకూ తెలంగాణలోని ఫతేనగర్​లో ఉండేవారు. ఇటీవలే బోయినపల్లిలోని కంసాలి బజార్​కు వచ్చారు.

ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు...

వెంకట్రావు కుమారుడు భాస్కర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బంధువులకు చెందిన ప్లాస్టిక్ మోడలింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను కుత్బుల్లాపూర్​లోని ఓ యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు...

భాస్కర్ వివాహం అనంతరం సరిగా విధులకు వెళ్లడం లేదు. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈనెల 11వ తేదీన తన భార్యను పుట్టింటికి పంపించిన అతను తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు.

అర్ధరాత్రి సమయంలో...

భార్య దూరంగా ఉండడం వల్ల మనస్తాపానికి గురైన భాస్కర్ రాత్రి​ సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు అతన్ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ.. అతను అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..వివాహమైన ఆరు నెలలకే ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట్రావు లక్ష్మిలు చాలా సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు..కొన్ని నెలల కిందటి వరకు ఫతేనగర్ లో ఉంటున్న కుటుంబం ఇటీవల బోయిన్పల్లిలోని కంసాలి బజార్ కు వచ్చారు..వెంకట్ రావు కుమారుడు భాస్కర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బంధువులకు చెందిన ప్లాస్టిక్ మోడలింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు..అతను కుత్బుల్లాపూర్ లోని మనోవిజ్ఞాన యువతిని ప్రేమిస్తున్నాడని పోలీసులు తెలిపారు..ఇద్దరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అంగీకరించి వివాహం చేశారు..ఈ క్రమంలో భాస్కర్ వివాహం అనంతరం సరిగా విధులకు వెల్లకపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి..ఈనెల 11వ తేదీన తన భార్యను పుట్టింటికి పంపించిన అతను తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు..రాత్రి భోజనం చేసిన అనంతరం పడక గదిలోకి వెళ్లి నిద్రపోయాడు..అర్ధరాత్రి సమయంలో అతని తల్లి చూడగా తను సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.