ETV Bharat / state

ఎన్టీఆర్ విగ్రహంతో పాటు బస్ షెల్టర్ తొలగింపు.. గ్రామస్థుల ఆగ్రహం. - సీతానగరంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వార్తలు

ఆ గ్రామస్థులందరూ కలిసి తీర్మానం చేసుకుని తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటే దాతల సహకారంతో బస్ షెల్టర్ నిర్మించుకున్నారు. అయితే చెప్పాపెట్టకుండా వైకాపా నేతలు విగ్రహాన్ని తీసి పక్కన పడేసి బస్ షెల్టర్​ను కూల్చివేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగింది.

ntr statue removed in sitanagaram
ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
author img

By

Published : Jul 10, 2020, 11:37 AM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తొలగించడం విమర్శలకు దారితీసింది. గ్రామస్థులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి.. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు.

స్థానిక వైకాపా నాయకులు షెల్టర్ తొలగించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి కల్యాణమండపం దగ్గర వదిలేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెల్టర్ తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తొలగించడం విమర్శలకు దారితీసింది. గ్రామస్థులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి.. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు.

స్థానిక వైకాపా నాయకులు షెల్టర్ తొలగించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి కల్యాణమండపం దగ్గర వదిలేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెల్టర్ తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి..

తూర్పుగోదావరిలో బ్యాంకుల వ్యవహారం కేసు సీబీఐకి అప్పగింత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.