ETV Bharat / state

చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్​లో.. మృతదేహాల తరలింపు

author img

By

Published : Jun 13, 2021, 12:05 PM IST

చెత్త తరలించే ట్రాక్టర్​లో మృతదేహాలను తీసుకెళ్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. పలు అనారోగ్య కారణాలతో మరణించిన నలుగురి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.

Moving the bodies in the garbage tractor
ట్రాక్టర్​లో మృతదేహాల తరలింపు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్​లో నాలుగు మృతదేహాలను తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్​ కవర్లలో సీల్​ చేసి ట్రాక్టర్​లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ సృష్టించాయి.

పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జీజీహెచ్ అధికారుల విజ్ఞప్తి మేరకు దహన సంస్కారాల నిర్వహణకు అనుమతించినట్లు చెప్పారు. మహాప్రస్థానం వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలిస్తామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి తెలిపారు. ట్రాక్టర్​లో తీసుకెళ్లిన ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్​లో నాలుగు మృతదేహాలను తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్​ కవర్లలో సీల్​ చేసి ట్రాక్టర్​లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ సృష్టించాయి.

పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జీజీహెచ్ అధికారుల విజ్ఞప్తి మేరకు దహన సంస్కారాల నిర్వహణకు అనుమతించినట్లు చెప్పారు. మహాప్రస్థానం వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలిస్తామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి తెలిపారు. ట్రాక్టర్​లో తీసుకెళ్లిన ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఆదరణ కరవై.. ఆవేదనతో వృద్ధురాలు ఆత్మహత్యాయ్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.