ETV Bharat / state

మడ అడవుల కేసు..విచారణ రెండు వారాలు వాయిదా - house sites in mangrove forests news

కాకినాడ సమీపంలో మడ అడవులను నరికి వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

ap high court
ap high court
author img

By

Published : Aug 28, 2020, 7:20 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మడ అడవులను నరికివేస్తోందంటూ పిటిషనర్​ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

కాకినాడ పోర్టుకు సమీపంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి. దశాబ్దాలుగా కాకినాడను వరదలు, తుపాన్ల నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని స్థానికులు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ఈ మడ అడవులను ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా నాశనం చేస్తోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మడ అడవులను నరికివేస్తోందంటూ పిటిషనర్​ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

కాకినాడ పోర్టుకు సమీపంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి. దశాబ్దాలుగా కాకినాడను వరదలు, తుపాన్ల నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని స్థానికులు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ఈ మడ అడవులను ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా నాశనం చేస్తోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

ఇదీ చదవండి

సీఎం గారూ.. మడ అడవులు మాయం చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.