ETV Bharat / state

పాటల ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తున్న హెడ్​కానిస్టేబుల్

author img

By

Published : May 31, 2021, 8:36 AM IST

కరోనా నియంత్రణలో భాగంగా అధికారులు విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాజాత రూపాల్లోనూ ప్రదర్శనలు చేశారు. ఈ క్రమంలో... స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ప్రత్యేక రీతిలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు ఓ హెడ్​కానిస్టేబుల్​. ఒకవైపు విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూ.. అధికారుల మన్ననలు పొందుతున్నారు.

awareness program
కరోనాపై అవగాహన కార్యక్రమం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్​స్టేషన్​లో హెడ్​కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఎం.కె.రత్నం పాటల ద్వారా కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. తానే స్వయంగా పాటను రచించి.. పాడుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, తాను రచించిన పాటలను ఆలపించారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆయన ఇప్పటివరకు ఆరు పాటలు రాశారు. ఓ విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహమ్మారిపై పోరాటానికి తన వంతు కృషి చేస్తున్న హెడ్​కానిస్టేబుల్​ను పోలీసు అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్​స్టేషన్​లో హెడ్​కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఎం.కె.రత్నం పాటల ద్వారా కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. తానే స్వయంగా పాటను రచించి.. పాడుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, తాను రచించిన పాటలను ఆలపించారు.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆయన ఇప్పటివరకు ఆరు పాటలు రాశారు. ఓ విధులు నిర్వహిస్తూ... మరోవైపు కరోనా నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహమ్మారిపై పోరాటానికి తన వంతు కృషి చేస్తున్న హెడ్​కానిస్టేబుల్​ను పోలీసు అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:

64 ఏళ్ల వయస్సులో... 43 మృతదేహాలకు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.