ETV Bharat / state

సంరక్షించే వారు లేక... గోమాతల ఆర్తనాదాలు!

కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే గోశాల నిర్వహణ దయనీయంగా మారింది. పట్టించుకునే వారు లేక మూగ జీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆవరణ పరిశుభ్రంగా లేక పరిసరాలు అధ్వాన్నంగా మారి మూగ జీవాలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నాయి. నిత్యం ఒకటి లేదా రెండు పశువులు చనిపోతండగా.. మిగిలిన పశువులు మౌనంగా రోదిస్తున్నాయి.

author img

By

Published : Jul 13, 2021, 8:53 AM IST

Updated : Jul 13, 2021, 10:17 AM IST

Goshala_Maintence_Dayaniyam
గోమాతల ఆర్తానాదాలు
సంరక్షించే వారు లేక... గోమాతల ఆర్తనాదాలు!

కాకినాడ 1వ డివిజన్ పరిధిలోని నాగమల్లి తోట జంక్షన్​లోని గోశాలలో 300 పైగా ఆవులను సంరక్షిస్తున్నారు. అక్రమంగా కబేళాలకు తరలించే పశువుల్ని, వాటితోపాటు కాకినాడ రహదారులపై సంచరించే వాటిని పశుహింస నివారణ సంఘం (SPCA)లోకి తరలించి సంరక్షిస్తుంటారు. దాతలు ఇచ్చే గడ్డితోపాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీటి సంరక్షణ జరగాలి. నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడం వల్ల పశువులు సంచరించే ఆవరణ పూర్తి అపరిశుభ్రంగా మారింది.

కొద్దిపాటి వర్షానికే బురదమయం అవుతుంది. మేత మేయడానికి కూడా ఆవరణ అనుకూలంగా లేదు. బురద, రొచ్చుతో పరిసరాలు అపరిశుభ్రంగా తయరై..మూగ జీవాలు రోగాల బారిన పడుతున్నాయి. ఆహారం చాలక డొక్కలు ఎండిపోయి ఉసూరుమంటున్నాయి. బురద కారణంగా పశువులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేకపోవడం, పగలు, రాత్రి తేడా లేకుండా నిలబడి జాగారం చేస్తున్నాయి. రోగాలుబారిన పడిన పశువులు గత వారం రోజులుగా నిత్యం చనిపోతూనే ఉన్నాయి, ఇప్పటివరకు పదికిపైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.

చనిపోయిన వాటిని గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక భాజపా నాయకులు పశుహింస నివారణ సంఘం కేంద్రాన్ని సందర్శించి SPCA కేంద్రం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పశు సంరక్షణా కేంద్రంలో గతంలోనూ పదుల సంఖ్యలో జీవాలు ప్రాణాలు కోల్పోయాయని. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోవు రోజుల్లో ఆవుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని కాపాడాలని జంతు ప్రేమికులు వేడుకొంటున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జలాలపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!

సంరక్షించే వారు లేక... గోమాతల ఆర్తనాదాలు!

కాకినాడ 1వ డివిజన్ పరిధిలోని నాగమల్లి తోట జంక్షన్​లోని గోశాలలో 300 పైగా ఆవులను సంరక్షిస్తున్నారు. అక్రమంగా కబేళాలకు తరలించే పశువుల్ని, వాటితోపాటు కాకినాడ రహదారులపై సంచరించే వాటిని పశుహింస నివారణ సంఘం (SPCA)లోకి తరలించి సంరక్షిస్తుంటారు. దాతలు ఇచ్చే గడ్డితోపాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీటి సంరక్షణ జరగాలి. నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడం వల్ల పశువులు సంచరించే ఆవరణ పూర్తి అపరిశుభ్రంగా మారింది.

కొద్దిపాటి వర్షానికే బురదమయం అవుతుంది. మేత మేయడానికి కూడా ఆవరణ అనుకూలంగా లేదు. బురద, రొచ్చుతో పరిసరాలు అపరిశుభ్రంగా తయరై..మూగ జీవాలు రోగాల బారిన పడుతున్నాయి. ఆహారం చాలక డొక్కలు ఎండిపోయి ఉసూరుమంటున్నాయి. బురద కారణంగా పశువులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేకపోవడం, పగలు, రాత్రి తేడా లేకుండా నిలబడి జాగారం చేస్తున్నాయి. రోగాలుబారిన పడిన పశువులు గత వారం రోజులుగా నిత్యం చనిపోతూనే ఉన్నాయి, ఇప్పటివరకు పదికిపైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.

చనిపోయిన వాటిని గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక భాజపా నాయకులు పశుహింస నివారణ సంఘం కేంద్రాన్ని సందర్శించి SPCA కేంద్రం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పశు సంరక్షణా కేంద్రంలో గతంలోనూ పదుల సంఖ్యలో జీవాలు ప్రాణాలు కోల్పోయాయని. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోవు రోజుల్లో ఆవుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని కాపాడాలని జంతు ప్రేమికులు వేడుకొంటున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జలాలపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!

Last Updated : Jul 13, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.