ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.. 11 మంది అరెస్టు

author img

By

Published : May 20, 2021, 2:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకుని... పదకొండు మందిని అరెస్టు చేశారు.

lorries
లారీలు స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో.. పోలీసులు దాడులు చేశారు. ఇసుక అక్రమ రవాణాల చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు గతంలో అధికారులు అనుమతినిచ్చారు.

ఈ వంకతో రాత్రి సమయంలో ఎర్రంశెట్టివారిపాలెం సమీపంలోని గోదావరి నుంచి ఏనుగు పల్లి గ్రామానికి ఇసుక రవాణా చేస్తున్నారని పి. గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు చేసిన దాడుల్లో 6 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో.. పోలీసులు దాడులు చేశారు. ఇసుక అక్రమ రవాణాల చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు గతంలో అధికారులు అనుమతినిచ్చారు.

ఈ వంకతో రాత్రి సమయంలో ఎర్రంశెట్టివారిపాలెం సమీపంలోని గోదావరి నుంచి ఏనుగు పల్లి గ్రామానికి ఇసుక రవాణా చేస్తున్నారని పి. గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు చేసిన దాడుల్లో 6 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

విడుదల కాని ఉత్తర్వులు.. జాప్యమవుతున్న కాలువ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.