తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఒకపక్క కరోనా విజృంభిస్తున్నా...మందుబాబులకు మాత్రం అవేవి పట్టడం లేదు. సాయంత్రమైతే చాలు..సినిమా టికెట్లు కోసం బారులు తీరినట్లు మద్యం కోసం బారులు తీరుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించటం మరిచి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.
కోనసీమ ప్రాంతంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నందున వైన్షాప్ల వద్ద మద్యం ప్రియులను కట్టడి చేయాలని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.