![new chariot of Antarvedi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8859946_752_8859946_1600514197301.png)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నూతన రథం నిర్మాణ పనులను దేవదాయ శాఖ అధికారులు శనివారం రావులపాలెంలో ప్రారంభించారు. రథం నిర్మాణానికి ప్రధానమైన కలపకు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం కోత పనులు ప్రారంభమయ్యాయి.
లక్ష్మీ నరసింహ స్వామి దివ్య రథాన్ని కళ్యాణోత్సవ సమయానికి పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు.