ETV Bharat / state

విషాదం: మేకల మేత కోసం చెట్టెక్కిన బాలుడు..పట్టుతప్పి..

author img

By

Published : Aug 25, 2021, 7:50 AM IST

పదకొండేళ్ల పసిప్రాయం.. ఆడుకునే వయసు.. తండ్రికి చేతనైనంత సాయం చేద్దామని.. మేకలకు ఆహారం కోసం ఆకులు కోసేందుకు చెట్టెక్కాడా బాలుడు. విధి వక్రించి.. విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఈ దయనీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో జరిగింది.

మేకలకు మేత కోసం చెట్టెక్కిన బాలుడు విద్యుదాఘాతంతో మృతి
మేకలకు మేత కోసం చెట్టెక్కిన బాలుడు విద్యుదాఘాతంతో మృతి

తూర్పుగోదావరి జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) చెట్టెక్కి ఆకులు కోస్తుండగా పట్టుతప్పి పక్కనే ఉన్న విద్యుత్తు తీగపై పడిపోయాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై శరీరం కాలి చనిపోయాడు. తీగపై వేలాడుతున్న మృతదేహాన్ని చూసి తండ్రి ముసలయ్యతోపాటు స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి అతికష్టం మీద మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) చెట్టెక్కి ఆకులు కోస్తుండగా పట్టుతప్పి పక్కనే ఉన్న విద్యుత్తు తీగపై పడిపోయాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై శరీరం కాలి చనిపోయాడు. తీగపై వేలాడుతున్న మృతదేహాన్ని చూసి తండ్రి ముసలయ్యతోపాటు స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి అతికష్టం మీద మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.

ఇదీచదవండి.

TS EAMCET RESULTS: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.