ETV Bharat / state

రూ.40 లక్షల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Apr 20, 2021, 4:15 PM IST

ఒడిశా నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న రూ. 40 లక్షలు విలువ చేసే గంజాయిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

ganja seized in east godavari
మారేడుమిల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద రూ.40 లక్షల విలువైన రెండు వేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్​స్టేషన్ ఎదుట వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్​లో గంజాయిని గుర్తించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

తనిఖీల్లో పట్టుబడిన గంజాయి వివరాలను రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా నుంచి మారేడుమిల్లి మీదుగా హైదరాబాద్​కు గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ గంజాయితో పాటు వ్యాను, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లను సీజ్ చేశామని ఆయన చెప్పారు. మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద రూ.40 లక్షల విలువైన రెండు వేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్​స్టేషన్ ఎదుట వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్​లో గంజాయిని గుర్తించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

తనిఖీల్లో పట్టుబడిన గంజాయి వివరాలను రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా నుంచి మారేడుమిల్లి మీదుగా హైదరాబాద్​కు గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ గంజాయితో పాటు వ్యాను, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లను సీజ్ చేశామని ఆయన చెప్పారు. మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేమ పెళ్లి గలాట: ఇరు వర్గాల ఘర్షణ.. 20 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.