గెలిపించలేదని అక్కసుతో రోడ్డు తవ్వేశాడు వార్డు మెంబర్గా తనను గెలిపించకపోవటంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి.. ఏకంగా తమ గ్రామానికి వెళ్లే రహదారిని తవ్విన ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం యర్రంపల్లెలో జరిగింది. బోడిగుట్ల పల్లె గ్రామ పంచాయతీలో నెర్విపల్లె, యర్రంపల్లె గ్రామాలున్నాయి. యర్రంపల్లె గ్రామ వార్డు సభ్యుడిగా రమేష్ పోటీ చేసి.. ప్రత్యర్థి చేతిలో 50 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్ యర్రంపల్లె గ్రామానికి వెళ్లే రహదారిని తొలగించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
నలభై సంవత్సరాల క్రితం రమేష్తో పాటు మరో ఎనిమిది మంది కలిసి గ్రామానికి రహదారి నిర్మించడానికి తమ పట్టా భూములు కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోవటంతో తన భూమిలో రహదారి వద్దంటూ రమేష్ తవ్వేశారని వాపోతున్న గ్రామస్థులు.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...