గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్న అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమానును పోలిన మరో చిన్న తిమ్మమ్మ మర్రిమాను వరుస కరువులతో ఎండి పోతూ నేలరాలిపోతుంది. ఇది పెద్ద తిమ్మమ్మ మర్రి మానుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఆర్యన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎద్దులవారి కోట సమీపంలో ఉన్న ఈ మర్రిమాను రెండు ఎకరాల విస్తీర్ణంలో 180 ఊడలతో విస్తరించి ఉంది. వర్షాలు బాగా కురిసి ఎప్పుడు ఏపుగా పెరుగుతుంది. ప్రస్తుతం పది సంవత్సరాలుగా నెలకొన్న వర్షాభావంతో భూమిలో తేమ అడుగంటిపోయి..ఎండిపోతూ నిరాదరణకు గురైంది.
వర్షాభావంతో ఎండిపోతున్న.. మహా వృక్షం
తీవ్ర వర్షాభావానికి మరో మహావృక్షం నేలకొరిగేలా ఉంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఆర్యన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎద్దులవారి కోట సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వరుస కరవులతో ఎండిపోతూ..నేల రాలి పోయేలా ఉంది.
![వర్షాభావంతో ఎండిపోతున్న.. మహా వృక్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706136-674-3706136-1561902268459.jpg?imwidth=3840)
ఈ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్డీవో నందిరెడ్డి ఇక్కడ చిన్న తిమ్మమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు. వంద సంవత్సరాల క్రితం ఎద్దులవారికోటకు చెందిన వృద్ధురాలు గిన్నిస్ బుక్ లోని తిమ్మమ్మ మర్రిమాను కాండాన్ని తెచ్చి ఇక్కడ పాతి పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో చుట్టు పక్కల గ్రామాల వారు ఈ చెట్టు కింద అనేక సమావేశాలు, గ్రామ సభలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకప్పుడు పర్యాటకుల సందడితో కలకలలాడే చిన్న తిమ్మమ్మ మర్రిమాను నేడు ఉనికిని కోల్పోతుంది. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారులు ఈ మహావృక్షం సంరక్షణకు, అభివృద్ధికి సహకరించాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...అక్కాతమ్ముడి 'చెప్పు' చేతల్లో విజయం
గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్న అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమానును పోలిన మరో చిన్న తిమ్మమ్మ మర్రిమాను వరుస కరువులతో ఎండి పోతూ నేలరాలిపోతుంది. ఇది పెద్ద తిమ్మమ్మ మర్రి మానుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఆర్యన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎద్దులవారి కోట సమీపంలో ఉన్న ఈ మర్రిమాను రెండు ఎకరాల విస్తీర్ణంలో 180 ఊడలతో విస్తరించి ఉంది. వర్షాలు బాగా కురిసి ఎప్పుడు ఏపుగా పెరుగుతుంది. ప్రస్తుతం పది సంవత్సరాలుగా నెలకొన్న వర్షాభావంతో భూమిలో తేమ అడుగంటిపోయి..ఎండిపోతూ నిరాదరణకు గురైంది.
ఈ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్డీవో నందిరెడ్డి ఇక్కడ చిన్న తిమ్మమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు. వంద సంవత్సరాల క్రితం ఎద్దులవారికోటకు చెందిన వృద్ధురాలు గిన్నిస్ బుక్ లోని తిమ్మమ్మ మర్రిమాను కాండాన్ని తెచ్చి ఇక్కడ పాతి పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో చుట్టు పక్కల గ్రామాల వారు ఈ చెట్టు కింద అనేక సమావేశాలు, గ్రామ సభలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకప్పుడు పర్యాటకుల సందడితో కలకలలాడే చిన్న తిమ్మమ్మ మర్రిమాను నేడు ఉనికిని కోల్పోతుంది. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారులు ఈ మహావృక్షం సంరక్షణకు, అభివృద్ధికి సహకరించాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...అక్కాతమ్ముడి 'చెప్పు' చేతల్లో విజయం
ETV Bharat:Satyanarayana(RJY CITY)
( ) విద్యను సంప్రదాయ సిద్ధంగా అధ్యయనం చేస్తే అందం వస్తుందని మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి చెందిన విశ్వనాథ గోపాలకృష్ణ ,ఆచార్య శలాక రఘునాధ శర్మ , డాక్టర్ కర్రి రామ రెడ్డి లకు రాష్ట్రపతి పురస్కారం అందుకున్న సందర్భంగా పౌర సత్కారం నిర్వహించారు. ఆనం కళాకేంద్రం లో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ,మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ చేతుల మీదుగా శాలువా మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గా విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగి తన గతం లో రాష్ట్రపతి మహామహోపాధ్యాయ ధర్మనా లంకార వంటి బిరుదులు లభించాయన్నారు. వాటన్నింటి కంటే ఇక్కడ జరిగిన పౌర సత్కారం ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు . తన తండ్రి రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాక పౌర సత్కారం జరిగిందని తనకు అదే గౌరవం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఆచార్య శలాక రఘునాధ శర్మ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం సంస్కృతికి సంప్రదాయానికి నిలియమన్నారు. తాను పుట్టింది కృష్ణాజిల్లా అయిన అఖండ గోదావరి తనకు అనంతమైన ఖ్యాతి అందించిందన్నారు. పౌర సత్కారం పెరగడమంటే నగరంలోని ప్రతి ఒక్కరూ గౌరవించినట్లే నన్నారు. డాక్టర్ కర్రి రామ రెడ్డి మాట్లాడుతూ సాహితీ రాజధానిలో ఎందరో పండితులు ఉన్నారు. మహా పండితులు శలాక విశ్వనాథ్ వంటి మహానీయుల తో పాటు తనకు అందించిన పౌర సత్కారం మరిచిపోలేనిదని సంఘటన అని అన్నారు. వైద్య వృత్తిలో తాను అందించిన సేవలకు అత్యున్నత బి.సి.రాయ్ పురస్కారం అందుకున్న సందర్భంగా జరిగిన ఈ సత్కారం ఉత్తమంగా నిలిచిపోతుందన్నారు. అంతకుముందు సన్మాన గ్రహీత లను కమిషనర్ మేయర్ సమక్షంలో వేద మంత్రాలతో వేదిక వద్దకు స్వాగతం పలికారు.
Body:AP_RJY_86_30_Rajamahendravaram_Nagara_Paura_Sanmanam_AVB_AP10023
Conclusion:AP_RJY_86_30_Rajamahendravaram_Nagara_Paura_Sanmanam_AVB_AP10023