చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ తల్లి, తన కుమార్తెకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో కుమార్తె మరణించగా.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఎర్రపల్లికి చెందిన సరస్వతికి హేమలత అనే కుమార్తె ఉంది. ఈమె మానసిక వికలాంగురాలు. ఆమె పరిస్థితి చూసి తల్లి మనో వేదనకు గురయ్యేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. అలాగే మదనపల్లి మండలం బసినికొండలో ఎనిమిదో తరగతి చదువుతున్న షాహినా అనే విద్యార్థిని ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి.
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం... ఇద్దరు మృతి - చిత్తూరు జిల్లా నేర వార్తలు
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుమార్తెకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కుమార్తె మరణించగా... తల్లి మృత్యువుతో పోరాడుతోంది. మరో ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
![వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం... ఇద్దరు మృతి two persons died and one person injured in differend suicide attempt actions in chithore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10221650-508-10221650-1610489240131.jpg?imwidth=3840)
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ తల్లి, తన కుమార్తెకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో కుమార్తె మరణించగా.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఎర్రపల్లికి చెందిన సరస్వతికి హేమలత అనే కుమార్తె ఉంది. ఈమె మానసిక వికలాంగురాలు. ఆమె పరిస్థితి చూసి తల్లి మనో వేదనకు గురయ్యేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. అలాగే మదనపల్లి మండలం బసినికొండలో ఎనిమిదో తరగతి చదువుతున్న షాహినా అనే విద్యార్థిని ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి.