తిరుమల తిరుపతి దేవస్థానం... తిరుమలలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించింది. రంగనాయకుల మండపం వేదికగా డిసెంబర్ 13వ తేదీ వరకు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గోపాష్టమిని పురస్కరించుకుని ఆవు, దూడలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు.
గోపూజ ముక్కోటి దేవతల పూజా ఫలంతో సమానమని పండితులు తెలిపారు. తొలుత కార్తీక విష్ణుపూజా సంకల్పంతో పూజను ప్రారంభించి... ప్రార్థనా సూక్తం, విష్ణుపూజ మంత్రంను పఠించారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేసిన అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో పూజను ముగించారు.
ఇదీ చదవండి