ETV Bharat / state

అడవిలోకి చొరబడేందుకు తమిళనాడు కూలీల యత్నం..అరెస్ట్​ - చిత్తూరు జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు తమిళనాడు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నిత్యావసరాల సరకులు, మద్యం, సామగ్రిని స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tamil Nadu workers arrested
తమిళనాడు కూలీలు అరెస్ట్c
author img

By

Published : Mar 15, 2021, 3:52 PM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోకి చొరబడేందుకు యత్నించిన తమిళనాడు కూలీలను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు అడ్డుకున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ప్రత్యేక కార్యదళం కూంబింగ్ నిర్వహించగా..అనుమానాస్పదంగా కనిపించిన కొంతమందిని అధికారులు ప్రశ్నించారు.

పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు 14మందిని అదుపులోకి తీసుకున్నారు. కూలీలంతా తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన వారిగా గుర్తించామని అధికారులు తెలిపారు. నిత్యావసరాల సరుకులు, మద్యం, సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్​ఫోర్స్ డీఎస్పీ పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోకి చొరబడేందుకు యత్నించిన తమిళనాడు కూలీలను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు అడ్డుకున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ప్రత్యేక కార్యదళం కూంబింగ్ నిర్వహించగా..అనుమానాస్పదంగా కనిపించిన కొంతమందిని అధికారులు ప్రశ్నించారు.

పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు 14మందిని అదుపులోకి తీసుకున్నారు. కూలీలంతా తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన వారిగా గుర్తించామని అధికారులు తెలిపారు. నిత్యావసరాల సరుకులు, మద్యం, సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్​ఫోర్స్ డీఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పురపోరులో వైకాపా జోరు.. 11 కార్పొరేషన్లు కైవసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.