ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ... భయం గుప్పిట్లో స్థానికులు

author img

By

Published : Apr 24, 2020, 7:21 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించి, రాకపోకలను నిషేధించారు.

spread to corona virus with very fast in chithoor district
వైరస్ వ్యాప్తి నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. యర్రావారిపాళెం మండలంలో 3, చిన్నగొట్టిగల్లులో 1, చంద్రగిరి మండలంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసులతో నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్, రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో నివసించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని ఆదేశించారు. ఈ ప్రాంతాలలో కొత్తవారు ఎవరూ రాకుండా చూడాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. యర్రావారిపాళెం మండలంలో 3, చిన్నగొట్టిగల్లులో 1, చంద్రగిరి మండలంలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసులతో నియోజకవర్గంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్, రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో నివసించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని ఆదేశించారు. ఈ ప్రాంతాలలో కొత్తవారు ఎవరూ రాకుండా చూడాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

కశ్మీర్​ 2020: లాక్​డౌన్​లో 18 మంది ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.