ETV Bharat / state

తిరుపతిలో‌ బాలుడి అపహరణ కేసులో పురోగతి

author img

By

Published : Mar 12, 2021, 8:51 AM IST

చిత్తూరు జిల్లాలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలుడి అపహరణ కేసులో కిడ్నాపర్ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు.

Chhattisgarh Boy Kidnap Case
తిరుపతిలో‌ బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి

తిరుపతి అలిపిరిలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడి కేసులో పురోగతి లభించింది. బాలుడి అపహరణ కేసులో కిడ్నాపర్ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారిలో ఓ కుటుంబానికి చెందిన శివమ్ కుమార్ సాహూ అనే బాలుడు.. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్‌ వద్ద ఫిబ్రవరి 27న అపహరణకు గురయ్యాడు. నిందితుడు చిత్తూరు జిల్లా వి.కోట పరిసర గ్రామవాసి శివప్పగా గుర్తించిన పోలీసులు.. రెండ్రోజుల క్రితం కిడ్నాపర్ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.

వి.కోటలో పిల్లల అపహరణ ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ముఠా సభ్యుడా, ఇంకేమైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వి.కోట సరిహద్దు కర్ణాటక గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

తిరుపతి అలిపిరిలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడి కేసులో పురోగతి లభించింది. బాలుడి అపహరణ కేసులో కిడ్నాపర్ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారిలో ఓ కుటుంబానికి చెందిన శివమ్ కుమార్ సాహూ అనే బాలుడు.. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్‌ వద్ద ఫిబ్రవరి 27న అపహరణకు గురయ్యాడు. నిందితుడు చిత్తూరు జిల్లా వి.కోట పరిసర గ్రామవాసి శివప్పగా గుర్తించిన పోలీసులు.. రెండ్రోజుల క్రితం కిడ్నాపర్ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.

వి.కోటలో పిల్లల అపహరణ ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ముఠా సభ్యుడా, ఇంకేమైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వి.కోట సరిహద్దు కర్ణాటక గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

సముద్రంలో బాలుడు గల్లంతు.. ఐదేళ్ల క్రితం అన్న కూడా ఇలాగే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.