ETV Bharat / state

వైకాపా వర్గీయుల మధ్య  ఘర్షణ: ఒకరి మృతి.. - చిత్తూరు జిల్లా రామాపురంలో వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా వర్గీయుల మధ్య నిన్న జరిగిన ఘర్షణలోని ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

One person killed in clash of  ysrcp leaders  in ramapuram
వైకాపా వర్గీయుల ఘర్షణలో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Jun 10, 2020, 11:37 AM IST

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా వర్గీయుల మధ్య నిన్న జరిగిన ఘర్షణలోని ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. 9వ తేదీన ఉపాధిహామీ పనుల విషయంలో వైకాపా వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. యంత్రాలతో ఉపాధి హామీ పనులు చేయిస్తుండడాన్ని వెంకటేష్‌ నాయక్‌ అనే వ్యక్తి మొబైల్​లో చిత్రీకరించాడు. ఈ విషయం గమనించిన చక్రవర్తి నాయక్‌ ... అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలుకాగా .. అతనిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్సపొందుతూ.. ఈ రోజు మృతిచెందాడు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన వివాదమే..ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా వర్గీయుల మధ్య నిన్న జరిగిన ఘర్షణలోని ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. 9వ తేదీన ఉపాధిహామీ పనుల విషయంలో వైకాపా వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. యంత్రాలతో ఉపాధి హామీ పనులు చేయిస్తుండడాన్ని వెంకటేష్‌ నాయక్‌ అనే వ్యక్తి మొబైల్​లో చిత్రీకరించాడు. ఈ విషయం గమనించిన చక్రవర్తి నాయక్‌ ... అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలుకాగా .. అతనిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్సపొందుతూ.. ఈ రోజు మృతిచెందాడు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన వివాదమే..ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-0.ఇదీచూడండి. పెళ్లింట విషాదం...విద్యుత్​ షాక్​తో వధువు అన్నయ్య మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.