ETV Bharat / state

తంబళ్లపల్లిలో లబ్ధిదారుల ఇంటికే పౌష్టికాహారం - tamballapalli cpdo

లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని చిత్తూరు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పౌష్టికాహార పంపిణీ ప్రారంభమైంది.

nutrition food distribution in tamballapalli
అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేత
author img

By

Published : Apr 18, 2020, 7:53 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్​డౌన్ ప్రభావంతో వీరు ఇంటికే పరిమితమైనందున ఈనెల 15 నుంచి మే 3 వరకు గుడ్లు, పాలు, బియ్యం, నూనె తదితర వస్తువులను లబ్ధిదారుల ఇంటికే అందిస్తామని అధికారులు తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక్కొక్కరికి 15 గుడ్లు, రెండు కిలోల బియ్యం, 400 గ్రాముల పప్పు, తల్లులకు 30 గుడ్లు, 250 మిల్లీలీటర్ల నూనె, 3 లీటర్ల పాలు, రెండు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని స్థానిక సీడీపీఓ సుజాత తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి..

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్​డౌన్ ప్రభావంతో వీరు ఇంటికే పరిమితమైనందున ఈనెల 15 నుంచి మే 3 వరకు గుడ్లు, పాలు, బియ్యం, నూనె తదితర వస్తువులను లబ్ధిదారుల ఇంటికే అందిస్తామని అధికారులు తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక్కొక్కరికి 15 గుడ్లు, రెండు కిలోల బియ్యం, 400 గ్రాముల పప్పు, తల్లులకు 30 గుడ్లు, 250 మిల్లీలీటర్ల నూనె, 3 లీటర్ల పాలు, రెండు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని స్థానిక సీడీపీఓ సుజాత తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి..

'కరోనా సోకిన వారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.