ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తవనంపల్లె మండలం జెట్టిపల్లెకు చెందిన గల్లా హేమచంద్ర చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మరో 9 చోరీ కేసులు అతడిపై నమోదైయ్యాయి. మొత్తం 22 కేసుల్లో ముద్దాయిగా ఉన్న హేమచంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ సిద్దంపల్లి క్రాస్ వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు మాటు వేసి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 52 గ్రాముల బంగారం, 2 ద్విచక్రవాహనాలు, రూ. 4.50 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి...నిజంగానే బ్యాంకుకు కన్నం వేశారు