ETV Bharat / state

ప్రధాని హోదాలో మూడోసారి తిరుమలకు మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం వద్ద గల కార్బన్‌ సెల్‌ కంపెనీ గ్రౌండ్‌లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం తిరుమలేశుడిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు.. తితిదే అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : Jun 9, 2019, 5:51 AM IST

తిరుమలకు మోదీ

శ్రీలంక టూ తిరుపతి
శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ.. కొలంబో విమానాశ్రయం నుంచి భారత వాయుసేన విమానంలో మూడు గంటలకు బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4:40 నుంచి 5 గంటలా 10 నిమిషాలవరకు విమానాశ్రయం వద్ద గల కార్బన్‌ సెల్‌ కంపెనీ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. 7 గంటలా 15 నిమిషాల వరకు స్వామివారి సేవలో ఉంటారు. ఆలయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. దిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

భారీ భద్రత
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం... నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని కాన్వాయిని పరిశీలించారు. ఆలయం వద్ద, కొండపై గల పరిసరాలలో, కనుమ దారును భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నాయి. 300 మందికి పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్వాగతించి.. వీడ్కోలు చెప్పనున్న ముఖ్యమంత్రి
ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తిరుపతి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు విమానంలో తిరుపతి వెళ్తారు. శ్రీవారి దర్శనానంతరం 8.15 గంటలకు ప్రధానికి వీడ్కోలు చెబుతారు. 8.30 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగుప్రయాణం కానున్న ముఖ్యమంత్రి... రాత్రి 9.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

తిరుమలకు మోదీ

శ్రీలంక టూ తిరుపతి
శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీ.. కొలంబో విమానాశ్రయం నుంచి భారత వాయుసేన విమానంలో మూడు గంటలకు బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4:40 నుంచి 5 గంటలా 10 నిమిషాలవరకు విమానాశ్రయం వద్ద గల కార్బన్‌ సెల్‌ కంపెనీ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. 7 గంటలా 15 నిమిషాల వరకు స్వామివారి సేవలో ఉంటారు. ఆలయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. దిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

భారీ భద్రత
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం... నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని కాన్వాయిని పరిశీలించారు. ఆలయం వద్ద, కొండపై గల పరిసరాలలో, కనుమ దారును భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నాయి. 300 మందికి పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్వాగతించి.. వీడ్కోలు చెప్పనున్న ముఖ్యమంత్రి
ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తిరుపతి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరతారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు విమానంలో తిరుపతి వెళ్తారు. శ్రీవారి దర్శనానంతరం 8.15 గంటలకు ప్రధానికి వీడ్కోలు చెబుతారు. 8.30 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగుప్రయాణం కానున్న ముఖ్యమంత్రి... రాత్రి 9.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

ఇదీ చదవండీ...

బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా: హోం మంత్రి సుచరిత

Intro:మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గనికి వచ్చిన తానేటి వనితకు ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్ విగ్రహాలకు ఆమె పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వూరు తెదేపా కంచుకోట అని దాన్ని పగులకొట్టిన ఘనత ప్రజానికానిది అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు


Body:మంత్రి వనిత


Conclusion:మంత్రి వనిత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.