చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పీవీసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోన్న గౌతమ్ ఉదయం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇతని తండ్రి మంజునాథ్ బి.కొత్తకోటలో ఓ హోటల్ నిర్వహిస్తుండగా... చదువు నిమిత్తం గౌతమ్ స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మృతుడు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అండర్ - 14, 16 క్రికెట్ పోటీల్లో రాణిస్తూ... కళాశాల క్రికెట్ జట్టుకు నాయకత్వ వహిస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి :