ETV Bharat / state

అన్నదాత చెంతకే విత్తనం.. రేపటినుంచి పంపిణీ - చిత్తూరు జిల్లాలో అందుబాటులో వేరుశనగ విత్తనాలు తాజా వార్తలు

ఖరీఫ్‌లో రైతులు వేరుసెనగ సాగుకు సన్నద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల హెక్టార్లలో వర్షాధారంగా ఈ పంట సాగుకానుంది. ఈ మేరకు సెనగ రాయితీ విత్తనాన్ని సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్‌ తెలిపారు. సోమవారం నుంచి గ్రామ సచివాలయాల్లో విత్తన పంపిణీని ప్రారంభించనున్నామని.. ఈనెల 30 నుంచి రైతు భరోసా కేంద్రాల్లో సేవలు ప్రారంభించి వాటిని అందుబాటులో ఉంచుతామన్నారు.

groudnut seeds distribution in chittore district
వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్
author img

By

Published : May 17, 2020, 2:38 PM IST

చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వారి అవసరాలకు తగ్గట్లు విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ విజయ్ కుమార్ తెలిపారు. విత్తనాలు ఎలా తీసుకోవాలి.. నగదు ఎలా కట్టాలి తదితర వివరాలు ఆయన తెలియజేశారు.

* ప్రభుత్వం జిల్లాకు 75 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించింది. జిల్లాలోనే 44 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించాం. మిగిలిన వాటిని ఏపీ సీడ్స్‌ ద్వారా తెస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో 37 వేల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశాం. విత్తన కొరత లేదు.

* విత్తనాలు కావాల్సిన రైతులు గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులను(వీఏఏ, వీహెచ్‌ఏ) సంప్రదించాలి. ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, చరవాణి నెంబరు అందజేయాలి.

* వారి వేలిముద్ర సేకరించి పేరు, ఎన్ని బస్తాలు తదితర వివరాలు నమోదు చేయగానే.. ఓటీపీ నెంబరు, ఎన్ని బస్తాలు, నగదు వివరాలు సంక్షిప్త సందేశం వారి చరవాణికి వస్తుంది.

* ఓటీపీ నెంబరును సచివాలయంలోని విలేజ్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌(వీడీఏ)కు అందజేసి నగదు చెల్లించాలి. ఏరోజు విత్తనాలు తీసుకోవాలో తెలియజేసే రసీదును ఇస్తారు.

* 18 నుంచి 28 వరకు గ్రామ సచివాయాల వద్ద, 30 నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాన్ని తీసుకెళ్లవచ్చు. రైతుకు గరిష్ఠంగా 3 బస్తాలు ఇస్తాం. అర ఎకరా విస్తీర్ణానికి ఒక బస్తా, ఎకరాకు 2 బస్తాలు, ఒకటిన్నర ఎకరా నుంచి ఆపై విస్తీర్ణం ఉంటే 3 బస్తాలు అందజేస్తామని' జేడీ విజయ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి.. కోయంబేడు చిచ్చు..7 జిల్లాల్లో 31 కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వారి అవసరాలకు తగ్గట్లు విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ విజయ్ కుమార్ తెలిపారు. విత్తనాలు ఎలా తీసుకోవాలి.. నగదు ఎలా కట్టాలి తదితర వివరాలు ఆయన తెలియజేశారు.

* ప్రభుత్వం జిల్లాకు 75 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించింది. జిల్లాలోనే 44 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించాం. మిగిలిన వాటిని ఏపీ సీడ్స్‌ ద్వారా తెస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో 37 వేల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశాం. విత్తన కొరత లేదు.

* విత్తనాలు కావాల్సిన రైతులు గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులను(వీఏఏ, వీహెచ్‌ఏ) సంప్రదించాలి. ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, చరవాణి నెంబరు అందజేయాలి.

* వారి వేలిముద్ర సేకరించి పేరు, ఎన్ని బస్తాలు తదితర వివరాలు నమోదు చేయగానే.. ఓటీపీ నెంబరు, ఎన్ని బస్తాలు, నగదు వివరాలు సంక్షిప్త సందేశం వారి చరవాణికి వస్తుంది.

* ఓటీపీ నెంబరును సచివాలయంలోని విలేజ్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌(వీడీఏ)కు అందజేసి నగదు చెల్లించాలి. ఏరోజు విత్తనాలు తీసుకోవాలో తెలియజేసే రసీదును ఇస్తారు.

* 18 నుంచి 28 వరకు గ్రామ సచివాయాల వద్ద, 30 నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాన్ని తీసుకెళ్లవచ్చు. రైతుకు గరిష్ఠంగా 3 బస్తాలు ఇస్తాం. అర ఎకరా విస్తీర్ణానికి ఒక బస్తా, ఎకరాకు 2 బస్తాలు, ఒకటిన్నర ఎకరా నుంచి ఆపై విస్తీర్ణం ఉంటే 3 బస్తాలు అందజేస్తామని' జేడీ విజయ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి.. కోయంబేడు చిచ్చు..7 జిల్లాల్లో 31 కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.