తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ను కారు ఢీకొన్న ఘటనలో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన సత్యనారాయణ చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి(కుమారుడు)గా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమల దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
ఇదీ చదవండి