ETV Bharat / state

తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు

author img

By

Published : Dec 19, 2020, 11:14 AM IST

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఆయిల్​ ట్యాంకర్​ను కారు ఢీకొట్టిన ఘటనలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

father-and-son-died-when-car-hits-oil-tanker-in-rangareddy-district
father-and-son-died-when-car-hits-oil-tanker-in-rangareddy-district

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్​కు‌ చెందిన సత్యనారాయణ చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి(కుమారుడు)గా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమల దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్​కు‌ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ఇదీ చదవండి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ఘటనలో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్​కు‌ చెందిన సత్యనారాయణ చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి(కుమారుడు)గా గుర్తించారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమల దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్​కు‌ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ఇదీ చదవండి

'దివిస్' ఘటనలో 160 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.